మద్దూరు(ధూళిమిట్ట), మే 29 : ఎండలు మండుతున్నాయి. మునుపటిలా కాకుండా ప్రస్తుతం నట్టెండ కాలంలోనూ చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండుకుండల్లా మారాయి. దీంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పిల్లలు, యువకులు వాటివైపు పరుగులు పెడుతున్నారు. ఈతలు కొడుతూ కేరింతలు కొడుతున్నారు. వేసవి తాపం తీర్చుకోవడానికి కొందరు, ఈత నేర్చుకోవడానికి మరి కొందరు, సరదాగా గడిపేందుకు ఇంకొందరు.. నీళ్లలో దూకి తమ ఈత ముచ్చట తీర్చుకుంటున్నారు.
ఇక పాఠశాలలకు సెలవులు ప్రకటించిన తర్వాతనైతే విద్యార్థుల ఆటపాటల్లో ఈత ఓ భాగమైపోయింది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈత విహారం విషాదానికి దారితీస్తున్నది. వినోదాన్ని పంచిన ఆ నీరే.. చీకట్లోకి నెట్టివేస్తున్నది. నీటిలో చేపపిల్లలా ఈదుతూ గెంతులేసిన పిల్లలు.. అదే నీటిపై విగత జీవులుగా తేలియాడాల్సి వస్తున్నది. ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి తల్లితండ్రులకు గర్భశోకాన్ని మిగులుస్తున్నారు. నీటి విషయంలో అవగాహన లేకపోవడం, తోటి వారు ఈత కొడుతుండగా ఉత్సాహాన్ని ఆపుకోలేక, ఈత రాకున్నా నీటిలోకి దిగడం, ప్రవాహ నీటిలో ఈత కొట్టడం, చెరువులు, బావులు, కాలువల్లో ఈత పేరుతో ప్రయోగాలు చేయడం, చేపలు పట్టేందుకు పెట్టిన వైర్లకు తగిలి విద్యుత్ షాక్కు గురికావడం వంటి కారణాల వల్ల ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది.
నీటి ప్రమాదాలకు ప్రధాన కారణాలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తలిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి
పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు, యువకులు జలాశయాలు, కాలువల్లో ఈతకు వెళ్లే క్రమంలో ప్రమాదాలు జరుగకుండా వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి. ఈత కొట్టే సమయంలో పెద్దలు వెంట ఉండాలి. ఈత రాని పిల్లలను ఒంటరిగా చెరువులు, బావులు, జలాశయాల వద్దకు వెళ్లకుండా చూడాలి. తల్లిదండ్రులు, పెద్దలు, నిపుణుల సమక్షంలోనే ఈత నేర్చుకునేలా చూడాలి. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో జలాశయాలు, కాల్వల వద్ద హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలి. నీటి ప్రమాదాలు జరుగకుండా పోలీసు శాఖ ద్వారా చర్యలు తీసుకుంటాం.
– అన్నెబోయిన నారాయణగౌడ్, ఎస్సై, మద్దూరు