మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా 30 పరీక్ష కేంద్రాల్లో ప్రథమ సంవత్స రం పరీక్షలకు 7,055 మందికి 6,642 మంది హాజరయ్యారు. 413 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి సత్యనారాయణ తెలిపారు. జనరల్ విభాగంలో 6,471 మందికి 6,113 మంది, ఒకేషన్ విభాగంలో 584 మందికి 529 మం ది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 94.14శాతం మంది పరీక్షలకు హాజరయ్యారని, 6శాతం మంది హాజరుకాలేదన్నారు. పరీ క్ష కేంద్రాలకు గంట ముందే అనుమతించిన ట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా డిబార్ లేదా మాల్ప్రాక్టీస్కు పాల్పడలేదన్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించడంతో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. జిల్లాకేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను నోడల్ అధికారి సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
– మెదక్ జిల్లా నెట్వర్క్, ఫిబ్రవరి 28