దుబ్బాక టౌన్, నవంబర్ 4 : దుబ్బాక మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని, స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికి మద్దతు తెలుపుతున్నారని మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి అన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలోని 6,18 వార్డులతోపాటు లచ్చపేట, చేర్వాపూర్ వార్డుల్లో పార్టీ శ్రేణులు శనివారం ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకూ సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు ప్రస్తుతం మ్యానిఫెస్టోలోని పథకాల వివరాలను తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజల నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నట్లు తెలిపారు. మరోసారి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్కు అన్నివర్గాల ప్రజల మద్దతు ఉందన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆస యాదగిరి, మూర్తి సంధ్యారాణీశ్రీనివాస్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, నాయకులు రొట్టె రాజమౌళి, వడ్లకొండ శ్రీధర్, ఆకుల దేవేందర్, బండి రాజు, అధికం బాలకిషన్గౌడ్, భూ పాల్, బట్టు ఎల్లం, పర్సకృష్ణ, పిట్ల స్వామి, శ్రీరాం సంగీత, దేవుని రాజు, గోనె మధు, ఎండీ సలీం, అల్తాఫ్, బాబా, గౌస్, జాంగీర్, సాధిక్, రేపాక పుష్ప, అరుణ, జాకీర్హుస్సేన్, రాజేశ్వరి, భూమ య్య, శ్రీను, విష్ణు పాల్గొన్నారు.