సిద్దిపేట, ఫిబ్రవరి 15: సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వెటర్నరీ కళాశాలను మంజూరు చేస్తే దానిని కొడంగల్కు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చూస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం నాయకులు పేర్కొన్నారు. గురువారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిద్దిపేటలో ప్రజలు, పంటలు, పశువుల కోసం వైద్యులను తయారు చేసే విద్యాలయాలను ఏర్పాటు చేసుకున్నామని, ఇక్కడి విద్యార్థుల కలలను నిజం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆశయాన్ని కాలరాసేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నిందని ఆరోపించారు. అందులో భాగంగా సిద్దిపేటకు మంజూరైన వెటర్నరీ కళాశాలను కొడంగల్కు తరలిస్తున్నారని, ఇది ఈ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయమేనని మండిపడ్డారు.
మెడికల్ కళాశాల, అగ్రికల్చర్ కళాశాలకు లేని అడ్డంకి వెటర్నరీ కాలేజీకి ఎందుకు వచ్చిందన్నారు. అవసరమైతే కొత్తగా మంజూరు చేసుకోవాలని సూచించారు. సిద్దిపేటకు మంజూరైన కళాశాలను తరలిస్తే ఊరుకునేది లేదని, ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యువజన విద్యార్థి విభాగం సీనియర్ నాయకుడు మెరుగు మహేశ్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు యాదగిరి ముదిరాజ్, యువజన, విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు రజనీకాంత్ రెడ్డి, శ్యామ్ యాదవ్, పట్టణ యువజన, విద్యార్థి విభాగం అధ్యక్షులు రెడ్డి ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ గౌడ్, పట్టణ సమన్వయకర్త ఇరుగంటి రమేశ్, యువజన విద్యార్థి విభాగం నాయకులు బెల్లంకొండ వెంకట్, రాగరం రాము, సాయి చరణ్ గౌడ్, బత్తిని శ్రీను, ఎర్రోళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.