వెల్దుర్తి/ రామాయంపేట, అక్టోబర్ 20 : కరోనా ప్రభావం తో పాఠశాలలకు దీర్ఘకాలిక సెలవులు ఇవ్వడంతో విద్యార్థుల్లో కొరవడిన కనీస అభ్యసన సామార్థాన్ని మెరుగుపర్చడమే లక్ష్యంగా తొలిమెట్టు కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్కుమార్ పేర్కొన్నారు. మండలకేంద్రం వెల్దుర్తిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గురువారం సం దర్శించారు. తొలిమెట్టు కార్యక్రమంలో జరుగుతున్న విద్యాబోధనను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మా ట్లాడి విద్యాబోధన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. పాఠశాలలకు దీర్ఘకాలిక సెలవుల కారణంగా విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో వారిని విజ్ఞానులుగా తీర్చిదిద్దడానికి ప్రభు త్వం తొలిమెట్టు పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. విద్యార్థు ల్లో కనీస అభ్యాసన సామర్థ్యాలు తక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. తొలిమెట్టులో తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులపై పట్టు సాధించడానికి విద్యార్థులకు ప్రత్యేక బోధన చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు విద్యాస క్తులు పెంపొందించే విధంగా తరగతి గదితో విద్యాబోధన చేయాలని సూచించారు. మన ఊరు – మన బడిలో జిల్లాలో 313 పాఠశాలలను ఎంపిక చేయగా, 240 పాఠశాలల్లో పను లను ప్రారంభించామని, 100 పాఠశాలలకు నిధులు మంజూ రయ్యాయని పేర్కొన్నారు. మనఊరు-మనబడిలో జిల్లాకు రూ.5కోట్లు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.4.50 కోట్ల ను ప్రభుత్వం విడుదల చేసిందని డీఈవో తెలిపారు. డీఈవో వెంట ఎంఈవో యాదగిరి, క్లస్టర్ నోడల్ అధికారి విజయ్కుమార్, మండల నోడల్ అధికారి సాంబయ్య ఉన్నారు.
విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధ్దం కావాలి
పదో తరగతి విద్యార్థులు ఎస్ఏ పరీక్షలకు సన్నద్ధ్దం కావాలని రామాయంపేట ఎంఈవో నీలకంఠం సూచించారు. రామాయంపేట మండలం అక్కన్నపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి, ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం పాఠశాల గదులను పరిశీలించి, విద్యార్థులతో మా ట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు వచ్చేది పరీక్షల కాలమని, కచ్చితంగా ప్రతి విద్యార్థి ఉత్తీర్ణతే లక్ష్యంగా చదవాలని సూచించారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించి, వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిద్దిదాలని ఆదేశించారు. ఆయన వెంట హెచ్ఎం ఉమారాణి, ఆర్పీ సంతోశ్ ఉన్నారు.