మెదక్ అర్బన్, మే 20 : దవాఖానల్లో రోగులకు అంది స్తున్న వైద్యసేవలను తప్పనిసరిగా ఆన్లైన్లోనే నమోదు చేయాలని ధ్రువీకరణ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీహరి పే ర్కొన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా ఏరియా దవాఖానను రాష్ట్ర ధ్రువీకరణ కమిటీ సభ్యులు సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మెదక్ జిల్లా ఏరియా దవాఖానలో 2011 నుంచి ఆన్లైన్ రిపోర్టింగ్ నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
హెల్త్ మేనేజ్మెంట్ ఇంటర్మెషన్ సిస్టం(హెచ్ఎంఐఎస్) 2008లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. దీనిలో వైద్య శాఖల వారీగా అందజేసిన సేవలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. మెదక్ జిల్లా ఏరియా దవాఖానలో సరిగ్గా అమలు అవుతున్నాయా? లేదా? అని రికార్డులను పరిశీలించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ నమో దు వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర ధ్రువీకరణ కమిటీ సభ్యులు నాగమల్లీశ్వర్, శ్రీనివాసరావు, జాన్సన్ శామ్యుల్, జిల్లా సూపరిండెంటెండ్ చంద్రశేఖర్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.