రామాయంపేట రూరల్, మే 08: ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం సందర్భంగా రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్లో ఉచిత మెగా వైద్య శిబిరం (Medical Camp) నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వివిధ పరీక్షలు చేయించుకున్నారు. నిరుపేదలందరికి సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా అన్ని పరీక్షలు చేశామని రెడ్ క్రాస్ మెదక్ శాఖ బృందం సభ్యులు తెలిపారు. అలాగే ఉచితంగా మందులు అందించామన్నారు.
ఒకప్పుడు జిల్లాలో అక్కడక్కడ శిబిరాలు నిర్వహించి పేదలకు సేవలు అందించే వారమని, ఇప్పుడు ప్రతి గ్రామంలో రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు అందున్నాయని చెప్పారు. రెడ్ క్రాస్ ద్వారా ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మెదక్ శాఖ చైర్మన్ డాక్టర్ లయన్ రాజశేఖర్రెడ్డి, కోశాధికారి డీజీ శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు యాదగిరి, దామోదర్రావు, మద్దెల సత్యనారాయణ, మద్దెల రమేష్, సతీష్ రావు, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.