ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని, దళారులకు అమ్మి మోసపోవద్దని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సంగారెడ్డి జడ్పీటీసీ మంజుశ్రీ రైతులకు సూచించారు. పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని వారు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా కల్పించారు.
– పుల్కల్, ఏప్రిల్ 29
పుల్కల్, ఏప్రిల్ 29: రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. శనివారం పుల్కల్ మండలంలోని మిన్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో రైతులను పట్టించుకోలేదన్నారు. ప్రతి పంటను ప్రభుత్వం మద్దుతు ధరకు కొనుగోలు చేస్తున్నదన్నారు. అకాల వర్షాల కారణంగా తడిసి ముద్దతువుతున్న వరిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. అంతకుముందు మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో మండల సమైఖ్య నుంచి వచ్చిన నూతన ట్రాక్టర్, పనిముట్లకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మంతూర్ గ్రామంలో జరుగుతున్న ఉర్సుల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు జైపాల్రెడ్డి, ఎంపీపీ చైతన్య విజయ్ భాస్కర్రెడ్డి, రైతుబంధు మండ ల అధ్యక్షుడు నర్సింహరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకులు కోరిన పుస్తకాలు తెప్పిస్తాం : మెదక్ జిల్లా గ్రంథాయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 29: పాఠకులు కోరిన పుస్తకాలు తెప్పిస్తామని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతి చంద్రాగౌడ్ అన్నారు. శనివారం జిల్లా గ్రంథాలయంలో లైబ్రేరియన్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠకులకు అన్ని రకాల పుస్తకాలు, సదుపాయాలు సమకూర్చాలన్నారు. సిబ్బం ది కొరత ఉండడంతో ఒక్కో లైబ్రేరియన్ రెండు నుంచి మూడు గ్రంథాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారని, ఇందుకు పాఠకులు సహకరించాలన్నారు. సిబ్బంది కొరత విషయం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆమె సానుకూలంగా స్పందించి, సిబ్బంది నియామకం చేపట్టనున్నట్లు తెలిపారన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి వంశీ, జిల్లాలోని ఆయా శాఖల లేబ్రేరియన్లు నరేందర్రెడ్డి, శంకర్, గణేశ్, యాదగిరి, లక్ష్మయ్య, స్వామి, అర్చన, మురళి, మధుసూదన్రెడ్డి, మమత పాల్గొన్నారు.