గురువారం కురిసిన అకాల వర్షం, వడగండ్ల వాన, ఈదురుగాలులకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల్లో 724 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు, ఉద్యానవనశాఖ అధికారి సునీత కోహీర్, జహీరాబాద్ మండలాల్లో పర్యటించి పంటనష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. మొక్కజొన్న, జొన్న, శనగ, టమాట, బొప్పాయి, మామిడి పంటలకు నష్టం వాటిల్లగా, పలుచోట్ల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్ శరత్కుమార్ ఆదేశించడంతో అధికారులు ఉన్నతాధికారులకు అందజేశారు.
సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ కోహీర్, మార్చి 17: సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వడటండ్ల వర్షాలకు 724 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షం తోపాటు వడగండ్లు కురవడంతో పంట నష్టం ఎక్కువగా వాటిల్లింది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. గురువారం జిల్లాలో 13.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదైంది. జహీరాబాద్ నియోజవర్గంలో అత్యధికంగా వర్షం కురిసింది. న్యాల్కల్ మండలంలో 4 సెం.మీ, జహీరాబాద్లో 3.5, రాయికోడ్లో 3.5, కోహీర్లో 3.3, ఝరాసంగంలో 2.5 సెం.మీ వర్షం కురిసింది. జహీరాబాద్ నియోజవర్గంలోని ఆరు మండలాలు, అందోలు నియోజకవర్గంలోని మునిపల్లి మండలంలో పంటలు దెబ్బతిన్నాయి.
వర్షం కారణంగా 479.9 ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, శనగ ఇతర పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యావన పంటలు 244.3 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు, ఉద్యానవనశాఖ అధికారి సునీత కోహీర్, జహీరాబాద్ మండలాల్లో పర్యటించి, రైతులతో మాట్లాడి పంటనష్టం వివరాలను తెలుసుకున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, మొ గుడంపల్లి, కోహీర్, ఝరాంసంగం, న్యాల్కల్ మండలాల్లోని 25 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మునిపల్లి మండలంలోని రెండు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నా యి. మునిపల్లి మండలంలో 290.1 ఎకరాల్లో మొక్కజొన్న, 184.2 ఎకరాల్లో జొన్న, 1.5 ఎకరాల్లో శనగ, 4.1 ఎకరాల్లో ఇతర పంటలకు నష్టం వాటిల్లింది.
జహీరాబాద్ మండలంలో 138 ఎకరాల్లో మొక్కజొన్న, 93 ఎకరాల్లో జొన్న పంట దెబ్బతింది. కోహీర్ మండలంలో 110 ఎకరాల్లో మొక్కజొన్న, 10 ఎకరాల్లో జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. కోహీర్ మండలంలో 42 ఎకరాల్లో మొక్కజొన్న, 46 ఎకరాల్లో జొన్న పంటకు నష్టం జరిగింది. 244.3 ఎకరాల్లో ఉద్యానవవన పంటలు దెబ్బతిన్నాయి. 129 ఎకరాల్లో మామిడి, 50 ఎకరాల్లో టమాట, 18 ఎకరాల్లో పుచ్చకాయ, 31 ఎకరాల్లో బొ ప్పాయి, 7.2 ఎకరాల్లో ఇతర పంటలు దెబ్బతిన్నాయి. కోహీర్ మండలంలో 55 ఎకరాలు, ఝరాసంగం మండలంలో 59 ఎకరాలు, మునిపల్లి మండలంలో 10.29 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతింది.
జహీరాబాద్ మండలంలో 28 ఎకరాల్లో టమాట, 16 ఎకరాల్లో బొ ప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. కోహీర్ మండలంలో 10 ఎకరాల్లో టమాట దెబ్బతింది. జిల్లాలో పంటనష్టం వివరాలను కలెక్టర్ శరత్ అధికారులను అడిగితెలుసుకున్నారు. పంట నష్టం వివరాలు అందజేయాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు నర్సింహారావు, సునీతను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో పంట నష్టంపై నివేదిక అందజేశారు. జిల్లాలో శుక్రవారం మోస్తారుగా వర్షం కురిసింది. జహీ రాబాద్, సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో తేలికపాటి వర్షం కురిసింది.
జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు
కోహీర్, మార్చి17: వడగండ్ల వానతో పంటలను కోల్పోయిన రైతులను ఆదుకుంటామని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు హామీ ఇచ్చారు. కోహీర్ మండలంలోని కొత్తూర్(కే), బడంపేట, పర్సపల్లి గ్రా మాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న, జొన్న, మామిడి, బొప్పాయి ఇతర పంటలకు నష్టం వాటిల్లిన ట్లు తెలిపారు. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారుల కు పంట నష్టం వివరాలు చెప్పాలని రైతులకు సూచించారు. ఆయన వెంట జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సరిత, ఏడీఏ భిక్షపతి, ఏవో నవీన్కుమార్ ఉన్నారు.