గజ్వేల్, నవంబర్ 24 : తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్నివర్గాలకు సముచిత న్యాయం చేస్తున్నారని డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) విజయాన్ని పురస్కరించుకుని గురువారం గజ్వేల్ పట్టణంలోని గ్యారాషహీద్ దర్గాలో మైనార్టీ నాయకులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల్లో ఆయన పాల్గొని ఫాతిహాలు సమర్పించారు. ఈ సందర్భంగా తంజిముల్మజీద్ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, వక్ఫ్బోర్డు చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జడ్పీటీసీ పంగమల్లేశం, వైస్ చైర్మన్ జకియొద్దీన్ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో పేదప్రజలు, రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. తెలంగాణలో ప్రజలంతా కలిసిమెలసి ఉన్నారని, అలాగే, బీఆర్ఎస్ పార్టీ ద్వారా సీఎం కేసీఆర్ దేశ ప్రజలంతా సంతోషంగా ఉండేలా కృషి చేయాలని, మునుగోడులో భారీవిజయాన్ని సాధించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ గజ్వేల్ గ్యారాషహీద్ దర్గాలో ప్రార్థనలు నిర్వహించినట్లు తెలిపారు.
గజ్వేల్లో గతంలో కన్నా వందరెట్లు మైనార్టీల అభివృద్ధి జరిగిందన్నారు. మజీద్ల అభివృద్ధి, ఫంక్షన్హాళ్ల నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణంతో మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందన్నారు. భవిష్యత్లో గజ్వేల్ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగనున్నదన్నారు. కాంగ్రెస్ కార్యకర్త వలీకి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమాల్లో కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ములుగులోని వంటిమామిడి ఏఎంసీ చైర్మన్ జహంగీర్, రాష్ట్ర యువజన నాయకులు జుబేర్పాషా ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించి తిరిగి హైదరాబాద్కు బయలుదేరారు.