అందోల్, ఫిబ్రవరి 20: అందోల్-జోగిపేటలో అక్రమ మైనింగ్ దందా జోరుగా సాగుతున్నది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. రాత్రికి రాత్రే అక్రమ రవాణా సాగుతుండడం తో అందోల్-జోగిపేటతోపాటు ఎర్రారం, మా సాన్పల్లి, సంగుపేట, చందంపేట్, డాకూర్ తదితర గ్రామాల శివారుల్లో కొండలు.. గుట్ట లు మాయమవుతున్నాయి. అందోల్-జోగిపేట పరిసర గ్రామాల్లో నిర్మాణాలు జోరుగా సాగుతుండడం, పెద్ద సంఖ్యలో వెంచర్లు ఏర్పడడంతో మొరం, భారీగా అవసరమవుతుంది. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు, నాయకు లు సంబంధిత శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఇష్టారీతిన మొర్రం తవ్వకాలు జరుపుతూ దందాకు తెరలేపారు. పలుచోట్ల మొరం లారీలను స్థానికులు పట్టుకుని రెవెన్యూ, పోలీసులకు అప్పగించారు. కానీ నిమిషాల వ్యవధిలోనే ఆ వాహనాలు మళ్లీ బయటకు వెళ్లాయని స్థానికులు తెలిపా రు. ఒక్కో టిప్పర్కు రూ. 6వేల వరకు వ సూ లు చేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ మైనింగ్పై ఉక్కుపాదం మో పాలని మంత్రి అధికారులను ఆదేశించినప్పటికీ ఇక్కడ మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నం గా కనిసిస్తున్నాయి. ఎవరైన ఫిర్యాదు చేస్తే తూతూమంత్రంగా చర్యలు ఉంటున్నాయి.
దీంతో కొండలు, గుట్టలు కరిగిపోతూ ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతోపాటు పర్యావరణానికి ముప్పు వాటిళ్లుతున్నది. అక్ర మ తవ్వకాలన్నీ అందోల్-జోగిపేట నుంచి సంగారెడ్డికి వెళ్లే ప్రధాన రాహదారులపైనే ఉన్నా సం బంధిత శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అక్రమంగా మట్టిని తవ్వుతూ వ్యా పారాలు సాగించే వారిపై నిఘా ఏర్పా టు చేశాం. ఎవరైన నిబంధనలకు వ్యతిరేకంగా అటవీ సంపదను కొల్లగొడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అందోల్-జోగిపేటతోపాటు మం డల వ్యాప్తంగా ఇటీవల అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు తెలియడంతో సిబ్బందిని అప్రమత్తం చేసి మట్టి, మొరం రవాణాకు అడ్డుకట్ట వేశాం. కలెక్టర్ సైతం ఈ విషయంపై సీరియస్ గా ఉండడంతో సిబ్బంది రాత్రి సమయంలో సైతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడైన అక్రమంగా తవ్వకాలు జరిగితే ప్రజలు సమాచారం ఇవ్వాలి.