గజ్వేల్, ఏప్రిల్ 5: కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానం కల్పించలేదని, బడ్జెట్లో ముస్లిం సంక్షేమానికి భారీగా నిధులు తగ్గించి వివక్ష చూపించిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ముస్లింలు విద్య, వైద్యం, సంక్షేమంలో పెద్దపీట వేశామన్నారు. ముఖ్యమైన పదవులు వారికి కేటాయించినట్లు గుర్తుచేశారు. శుక్రవారం రాత్రి గజ్వేల్ పట్టణంలోని మదీనా మసీద్లో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో హరీశ్రావు పాల్గొన్నారు. ముస్లింలకు పండ్లు తినిపించారు.
విందులో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంక్రటామిరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, మైనార్టీ రాష్ట్ర నాయకులు జుబేర్, జాఫర్ఖాన్, విరాసత్ అలీ, మదీనా మసీద్ అధ్యక్షుడు యూసూఫ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్మీరా, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.