హుస్నాబాద్టౌన్, డిసెంబర్ 16: కఠోర దీక్షలు చేసే అయ్యప్ప స్వాముల కోసం వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధిలో మాలధారులకు నిత్యాన్నదానం నిర్వహిస్తూ అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నది హుస్నాబాద్ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ. ప్రత్యేకంగా సిద్ధేశ్వరస్వామి గుట్టపై దక్షిణం వైపున ఈ ఆలయాన్ని అధ్భుతంగా నిర్మించారు. ఆలయం దినదినాభివృద్ధి చెం దుతున్నది. సకల సౌకర్యాల కల్పనతో ఆలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.
హుస్నాబాద్ పట్టణ శివారులోని సిద్ధేశ్వరస్వామి గుట్టపై పాల్గుణ శుద్ధ దశమి 2002 మార్చి 24న అయ్యప్పస్వామి ఆలయ ప్రతిష్ఠను పీఠాధిపతుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు. ఉమ్మడి జిల్లాల్లో గుట్టపై ఉన్న ఏకైక ఆలయం హుస్నాబాద్ ఆయ్యప్పస్వామి ఆలయం మాత్రమే. ఈ ఆలయం ఏడాదిపాటు భక్తులకు దర్శనం కల్పిస్తున్నది. స్వామి దీక్ష చేపట్టిన వారు దాదాపు 200 మంది ఇక్కడే దర్శనం చేసుకొని ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. మండల పూజమహోత్సవం ఏటా ఆలయంలో నిర్వహిస్తున్నారు. శబరిమలైలో జరిగే మకరజ్యోతి దర్శనంరోజు భక్తులు సమర్పించిన ఆభరణాలను చూసే భాగ్యం కల్పిస్తారు.
కేసీఆర్ సర్కార్ హయాంలో నిత్య అన్నప్రసాద కేంద్రం కోసం ప్రత్యేకంగా భవనా న్ని నిర్మించింది. డీఎంఎఫ్టీ, సీడీఎంకు చెం దిన రూ.28 లక్షలతో 4,500 చదరపు గజా ల స్థలంలో భవనాన్మి నిర్మించారు. ఒకేసారి 200 మంది వరకు భక్తులు, స్వాములు అన్నప్రసాదాన్ని స్వీకరించేలా నిర్మించారు. భక్తుల సహకారంతో ఆలయ ఆవరణలో రూ.20 లక్షలతో చేపట్టిన రేకుల షెడ్డు నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి.
అయ్యప్ప స్వాములకు హుస్నాబాద్అ య్యప్పస్వామి ఆలయంలో నిత్యాన్నదానం చేస్తున్నారు. ఏటా కార్తీక మాసం నుంచి మార్గశిర మాసం వరకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఆలయ కమిటీకి తోడు భక్తులు సైతం అన్నదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. దాదాపు 200మందికి పైగా భక్తులు 45 రోజులపాటు భిక్ష ఏర్పాటు చేశారు. ఏటా నవంబర్ 25 నుంచి జనవరి మాసం వరకు ఈ అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిష్టతో చేపడుతున్నారు.
హుస్నాబాద్ ప్రజలు, భక్తులు, నాయకులు, సంస్థల సహకారంతో సిద్ధేశ్వరస్వామి గుట్టపై అయ్యప్ప ఆలయం దినదినాభివృద్ధి చెందుతున్నది. కేసీఆర్ సర్కార్ హయాంలో అయ్యప్ప స్వాముల కోసం నిత్యాన్నదాన ప్రసాద కేంద్రాన్ని నిర్మించారు. అన్ని సౌకర్యాలు కల్పించడంతో ఏటా అయ్యప్ప స్వామి దీక్షాపరులు పెరుగుతున్నారు. ఆలయ ఆవరణలో రేకుల షెడ్డు నిర్మాణం త్వరలో పూర్తవుతుంది.
అయ్యప్పను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృప లభిస్తున్నది. ఏటా అయ్యప్ప దీక్షాపరులు పెరుగుతున్నారు. కఠినమైన దీక్షలు చేసేందుకు భక్తులు ముందుకు వస్తున్నారు. అయ్యప్పను నమ్ముకున్న వారికి అన్ని విజయాలే లభిస్తున్నాయి. అందుకే మాలధారణ చేసే భక్తులు పెరుగుతున్నారు. శబరిమలలో నిర్వహించే ఉత్సవాలను ఇక్కడి ఆలయంలో నిర్వహిస్తూ భక్తుల మనోభావాలను పరిరక్షిస్తున్నాం.