అల్లాదుర్గం, నవంబర్ 12 : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల పరిధిలోని ముప్పారం తండాకు చెందిన గోరా మోతిబాయి (110) శతాధిక వృద్ధురాలు కన్నుమూసింది. ఈమెకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వందేళ్లు పైబడిన ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా తన పనులను తాను చేసుకుంటూ ఆరోగ్యంగా జీవించింది.
శుక్రవారం ఆమె అకస్మత్తుగా మృతిచెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.