చిన్న శంకరం పేట్ : చిరుత పులి దాడిలో గుర్రం పిల్ల మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరం పేట్ మండలం టి మాందాపూర్ గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కురుమ మల్లయ్య గొర్రె పిల్లలతో పాటు గుర్రాన్ని పెంచుకుంటున్నా డు. సోమవారం రాత్రి గ్రామ శివారులో గొర్రెల మంద వద్ద గుర్రాన్ని ఉంచుకొని నిద్రకు ఉపక్రమించాడు.
తెల్లవారుజామున నిద్రిస్తున్న గుర్రం పిల్లపై చిరుత పులి దాడి చేయగా గుర్రం అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని గమనించి గమనించిన గొర్రెల కాపరులు కేకలు వేయగా చిరుత పులి అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని గొర్రెల కాపరులు తెలిపారు.
విషయాన్ని తెలుసుకున్న బీట్ ఆఫీసర్ నవీన్ సంఘటన స్థలానికి చేరుకొని పంచనానా చేశారు. అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్న అందువల్ల ప్రజలు అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని సూచించారు.