ములుగు, డిసెంబర్ 19 : గర్భిణుల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ను త్వరలోనే అందించనున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం ములుగు మండలంలోని క్షీరసాగర్లోని హంస హోమియోపతి మెడికల్ కళాశాలలో 75 పడకల సంయుక్త హోమియో దవాఖానను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జహంగీర్, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సంప్రదాయ వైద్యానికి ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. తెలంగాణలో అందరికీ వైద్యం అందించే క్రమంలో పల్లె దవాఖానలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో తీసుకువచ్చామన్నారు. పల్లె దవాఖానల్లో పనిచేసేందుకు ఆయుష్ డాక్టర్లను కూడా రిక్రూట్ చేస్తున్నామన్నారు. వివిధ రాష్ర్టాల నుంచి హైదరాబాద్లో వైద్యం పొందేందుకు పేషెంట్లు వస్తున్నారని, అన్ని ఆయుష్ విభాగాలను పటిష్టం చేస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు మెరుగైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుం దన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్వింగ్ ఉపాధ్యక్షుడు జుబేర్పాషా, హంసహోమియోపతి డైరెక్టర్ డాక్టర్ ఉమేశ్, బీఆర్ఎస్ నాయకుడు అంజన్గౌడ్, కేబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొన్యాల బాల్రెడ్డి, ఎంపీపీ, పీఏసీఎస్, ఏఎంసీ ఉపాధ్యక్షులు దేవేందర్రెడ్డి, నరేశ్గౌడ్, భూపాల్రెడ్డి, రోటరీక్లబ్ అధ్యక్షుడు ఏనుగు బాపురెడ్డి, కళాశాల సిబ్బంది, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు.