రామాయంపేట, జనవరి 29 : ఒకప్పుడు దొంగల ధర్మారంగా పేరుగాంచిన గ్రామం ఇప్పుడు.. ప్రగతి ధ ర్మారంగా మారింది. అభివృద్ధిలో ముందుకు సాగ డం తో డి.ధర్మారం జిల్లాకే ఆదర్శం మారింది. తెలంగాణ రావడం.. కేసీఆర్ సీఎంగా కావడంతోనే గ్రామానికి కొత్త హంగులు నెలకొన్నాయి. దశాబ్దం క్రితం రామాయంపేట ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా ఉన్న పద్మాదేవేందర్రెడ్డి గ్రామానికి కోట్లాది రూపాయలు మం జూరు చేసి, అనేక అభివృద్ధి పనులను ప్రారంభించా రు. ప్రస్తుతం మెదక్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్ రెడ్డి మరిన్ని నిధులను కేటాయించి ధర్మారం గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారు.
గతేడాది రూ.8కోట్ల నిధుల తో చేపట్టిన పనులతో ధర్మారం ప్రగతి ధర్మారంగా మా రనున్నది. సీఎం ప్రత్యేక కార్యదర్శి చొరవతో గ్రామంలోని రూ.3.50కోట్లతో గ్రామస్తులకు ఫంక్షన్హాల్, రూ.11 లక్షలతో మినీపార్కు నిర్మించారు. రూ.75లక్షలతో పాఠశాల అదనపు భవనాలు, రూ.1కోటి 50లక్షలతో ప్రతి వీధికి సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, ప్రహరీల నిర్మా ణం చేపడుతున్నారు. తాగునీటి అవసరాలు తీర్చడం కోసం నాలుగు మిషన్ భగీరథ ట్యాంకులను నిర్మించా రు. రూ.20లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.8 లక్షలతో పల్లె ప్రకృతివనం, రూ.1.35లక్షతో డంపింగ్యార్డు, రూ.32 లక్షలతో వైకుంఠధామం, రూ.11 లక్షలతో మినీపార్కును నిర్మించారు.
గ్రామ సమీపం లో ని పెద్దచెరువు ఆధునీకరణకు రూ.1కోటి 12లక్షలు కేటాయించారు. గ్రామాభివృద్ధికి సీఎస్ఆర్ కోటాలో రూ.50లక్షలు మంజూరయ్యాయి. ప్రధాన రోడ్డుపై డివైడర్లు, హైమాస్టు లైట్లను ఏర్పాటు చేశారు. దశాబ్దాల కాలంగా దొంగల ధర్మారంగా పేరున్న గ్రా మాన్ని నేడు ప్రగతి సాధించడంతో ప్రగతి ధర్మారంగా పేరుగా మార్చారు. డి.ధర్మారం గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి సీఎం కేసీఆర్కు ప్రత్యేక కార్యదర్శిగా పని చేస్తు న్నారు. సొంత గ్రామానికి రాజశేఖర్రెడ్డి చేస్తున్న కృషి ఎనలేనిది. అధికారులు సైతం ఎప్పటికప్పుడు గ్రామా న్ని సందర్శించి, అభివృద్ధి పనులను పరిశీలించారు.
పెద్దచెరువు చుట్టూ గార్డెన్
డి.ధర్మారం గ్రామానికి ఆనుకుని పెద్ద చెరువుకట్టను ఆధునీకరించడా నికి ప్రభుత్వం రూ.1.13 లక్షలను మంజూరు చేసింది. ఈ నిధులతో పెద్దచెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చెరువు చుట్టూరా గార్డెన్, పూల మొక్కలతోపాటు రకరకాల జౌషధ మొక్కలను పెంచుతున్నారు. పెద్ద చెరు వు ఇప్పుడు గ్రామానికే ఆకర్షణీయంగా మారింది.
– శ్రీనివాస్రావు, ఇరిగేషన్శాఖ డీఈ
గ్రామస్తుల సహకారం గొప్పది
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్రెడ్డి ప్రత్యేక చొరవతో ధర్మారం గ్రామం అభివృద్ధ్దిలో ముందుకు తీసుకువెళ్తున్నాం. ప్రస్తుతం గ్రామాభివృద్ధికి కృషి చే స్తున్న వారిద్దరికి నేను జీవితకాలం రుణసడి ఉంటా. సర్పంచ్గా నా హయాంలో అభివృద్ధి జరగడం ఆనందంగా ఉన్నది. గ్రామస్తుల సహకారం గొప్పది.
– బొడ్డు శంకర్, సర్పంచ్