కొల్చారం, మే 26 : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం… ఇప్పటికే ఎనిమిది విడుతల్లో కోట్ల మొక్కలు నాటింది. ఇప్పుడు తొమ్మిదో విడతలోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఎక్కడా వెనక్కి తగ్గకుండా నిధులు కేటాయిస్తూ హరితహారం నిర్వహిస్తున్నది. గడిచిన ఎనిమిది విడుతల్లో హరితహారం అను భవాలను పరిగణనలోకి తీసుకుని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈసారి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్ర భుత్వం నిర్ణయించింది. రహదారుల వెంట రెండు వరుసల్లో వనాల అభివృద్ధి, అధిక విస్తీర్ణంలో ప్రకృతి వనాల అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఈసారి సాగునీటి ప్రాజెక్టుల ఖాళీ భూము లు, కాలువల వెంట పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉపాధి హామీ పథకం, అటవీ, పంచాయతీరాజ్శాఖల ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసింది. అదే తరహాలో ఈయేడాది కూడా నర్సరీల్లో మొక్కలను విరివిగా పెంచుతున్నారు. ఇందులో అటవీ మొక్కలు, ఔషధ, పండ్లు తదితర మొక్కలు పెంచుతున్నారు.
హరితహారంలో భాగంగా భారీ ఎత్తున నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభం కాగానే అటవీశాఖ ఆధ్వర్యం లో భారీస్థాయిలో మొక్కలు నాటడానికి సిద్ధం చేస్తున్నారు. హరితహారంలో మొక్కలు నాటడానికి ఉపాధిహామీ పథ కం కింద కొన్ని గ్రామాలకు కలిపి పెద్ద నర్సరీలను ఏర్పాటు చేసి లక్ష చొప్పున మొక్కలు పెంచేవారు. ఇప్పుడు ప్రతి గ్రా మంలో నర్సరీలు ఏర్పాటు చేసి, పది వేల మొక్కలు పెంచు తున్నారు. నర్సరీల్లో మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయి. కొల్చారం మండల వ్యాప్తంగా 21 గ్రామ పంచాయతీల్లో గ్రామ నర్సరీలుండగా, పెద్ద సంఖ్యలో మొక్కలను పెంచడానికి అటవీశాఖ ఆధ్వర్యంలో రాంపూర్లోని సెంట్రల్ నర్సరీలో లక్షా అరవై వేల మొక్కలను పెంచుతున్నారు. అటవీప్రాంతం లో నాటేందుకు అడవి మొక్కలైన జట్రేగి, నారేపి, యెరుమతి, నెమలినార, కానుగ, మారేడు, సీతాఫలం, సీమచింత, ఇరికి, వెలగ మొక్కలతోపాటు ఆశ్వగంధ, రణపాల, లెమన్గ్రాస్, కృష్ణతులసి, పామరుజి, గోరింట, వావిలి, కలబంధ ఔషధ మొక్కలను పెంచుతున్నారు. అటవీప్రాంతంలో నాటేందుకు భారీగా పెరిగిన మొక్కలు అవసరం. దీంతో నర్సిరీల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టి, మొక్కలను ఏపుగా పెంచుతున్నారు.
మొక్కలు ఏపుగా పెరిగేలా చర్యలు
ప్రభుత్వం హరితహారం కార్యక్రమా న్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి ఏటా వివిధశాఖల ఆధ్వర్యంలో మొక్క లను నాటి, సంరక్షించే బాధ్యతను ఆయా శాఖాలకే అప్పగించింది. అటవీప్రాంతంలో నాటడానికి భారీగా పెరిగిన మొక్కలు అవస రం. అలాంటి మొక్కలను నాటితే వేగంగా పెరగడంతోపా టు బతికే అవకాశాలు అధికంగా ఉంటుంది. అందుకే నర్సరీల్లో మొక్కలను పర్యవేక్షిస్తూ, కింద పడిపోయిన మొక్కలను సరిచేయిస్తున్నాం. నీడ నిచ్చేవాటితోపాటు పండ్ల మొ క్కలను అటవీప్రాంతంలో ఎక్కువ మొత్తం నాటనున్నాం. ప్రస్తుతం అడవుల్లో తినడానికి తిండి లేకపోవడంతోనే కో తులు, వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయి. ఆటవీ ప్రాంతంలో మొక్కలను పెంచితే కోతులతోపాటు వన్య ప్రాణులు తిరిగి అడవుల్లోకి వెళ్తాయి. అడవులు పెరిగితే పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది.
– మహ్మద్ జలీల్, రాంపూర్ నర్సరీ ఇంచార్జి.