సిద్దిపేట, జనవరి 24: సిద్దిపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని సంతోషిమాత దేవాలయంలో రూ.50 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పునర్నిర్మాణం చేసిన అన్నదాన భవన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాంకాల నవీన్కుమార్, పాలక మండలి సభ్యులు మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు, ఏఎంసీ చైర్పర్సన్ విజిత వేణుగోపాల్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రామచందర్రావు, కౌన్సిలర్లు దీప్తి నాగరాజు, బ్రహ్మం, ఆలయ పాలక మండలి సభ్యులు సత్యంగౌడ్, ప్రభాకర్, కల్యాణి, మాధురి, కృష్ణ, మధుసూదన్శర్మ, సంతోష్, ఈవో విశ్వనాథ్శర్మ, ఆలయ పూర్వ చైర్మన్లు వీరేశం, కాశీనాథ్, రమేశ్ పాల్గొన్నారు.
బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
సిద్దిపేట పట్టణంలోని అన్ని వార్డుల్లో రోడ్లను అద్దంలా మెరిసిలా నిర్మించనున్నట్లు మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని 1వ వార్డు నుంచి 21వ వార్డు వరకు కలుపూతూ నిర్మించే బీటీ రోడ్డు పనులకు మంత్రి మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం 18వ వార్డులో మినీ గూడ్స్ డీసీఎం ట్రాన్స్పోర్టు అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్ అడ్డగట్ల కావేరి అంజి, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి, సీనియర్ నాయకులు లోకలక్ష్మీరాజ్యం, శ్రీహరి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.