సిద్దిపేట, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆలయాల్లో పూజలు చేశారు.

మసీదు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. నిత్యం అభివృద్ధి, పేదల సంక్షేమానికి పాటుపడుతున్న హరీశ్రావుకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అందరూ దేవుడిని మొక్కుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో హరీశ్రావును కలిసి పూలబొకేలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.

వివిధ కారణాలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మృతిచెందిన నలుగురు బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష చొప్పున ఎఫ్డీ బాండ్లు అందజేసి అండగా నిలిచారు. మర్కూక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల టెన్త్లో ఉత్తీర్ణత పొందిన 18 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పన నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.