మెదక్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని సాయిబాలాజీ, ద్వారకా గార్డెన్స్లో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ 2014 తర్వాత చాలా ఉద్యోగావకాశాలు కల్పించారన్నారు. ఇప్పటికే 1.37 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని, అందులో పోలీసు, గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు ఇతర శాఖల్లోనూ ఉద్యోగాలు కల్పించారన్నారు. ఇంకా 70 నుంచి 80 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కంటే మెదక్ జిల్లా వెనుకబడి ఉన్నదని, ఈ ప్రాంతంలో నిరుద్యోగులు ఉన్నారని గుర్తించిన తాను మెగా జాబ్మేళాతో ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో చదువుకున్న వారికి వారి అర్హతను బట్టి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారన్నారు. యువతను సన్మార్గంలో పయనింపజేసేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మున్ముందు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత హాజరయ్యారు.
అనంతరం 70 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై, ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీటికి సుమారు 4500 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రముఖ కంపెనీలు విప్రో, జెన్ ప్యాక్, హెచ్సీఎల్, అపోలో, మెడ్ప్లస్, హోం ఇన్నోవేషన్, ప్రైమరీ హెల్త్ కేర్, గూగుల్ పే, హెచ్ఎఫ్డీఎఫ్సీ, వరుణ్ మోటార్స్, ఐటీ ఫార్మా కంపెనీలతో పాటు బ్యాంకింగ్ సంస్థలు కూడా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నాయి. నెలకు కనీసం రూ.20 వేలు మొదలుకుని రూ.40వేల జీతంతో 450 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. నియామక పత్రాలను ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అందజేశారు. వారంలోగా మరో 500 మందికి ఆఫర్ లెటర్స్ అందజేయనున్నట్లు తెలిపారు. మొత్తం వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు. శ్రద్ధాసక్తులతో విద్యాభ్యాసం పూర్తి చేసి భవిష్యత్పై ఆలోచనతో ముందుకు సాగాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ పడాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మెగా జాబ్ మేళా నిర్వహించినట్లు ఎమ్మెల్సీ వెల్లడించారు. నియామక పత్రాలు పొందిన ఉద్యోగార్థులు ఎమ్మెల్సీకి ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్సీ పుట్టిన రోజు సందర్భంగా మెదక్లో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు యువకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ సందర్శించారు. కార్యక్రమంలో హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, కౌన్సిలర్లు ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు గోదల సాయి, బొందుగుల కృష్ణ, సులోచన ప్రభురెడ్డి, హవేళీఘనపూర్ మండల నాయకులు మహిపాల్రెడ్డి, దేవాగౌడ్, వినోద్, లక్ష్మీనారాయణ, సాయాగౌడ్, సాయిలు, దుర్గారావు, సిద్ధిరెడ్డి, శ్రీనివాస్, శ్రీనునాయక్, రాజునాయక్, ఫుల్సింగ్, రమేశ్, కిషన్, తొగుట శ్రీహరి, బ్యాతోల్ శ్రీనివాస్, స్వామినాయక్, రెడ్యానాయక్, మద్దెల భాస్కర్, బాలు, భయన్న, నార్సింగి నాయకులు రాజేశ్, నర్సింగ్రావు, లాల్సింగ్, ఇప్ప రవితేజ, చిన్నశంకరంపేట నాయకులు గంగా నరేందర్, లింగంగౌడ్, రాజుసింగ్, సాన సత్యనారాయణ, పడాల సిద్ధరాములు, మనోజ్, కుమార్, సుధాకర్, రంగారావు, సత్యం, ప్రతాప్రెడ్డి, రాజిరెడ్డి, జీవన్, రమేశ్గౌడ్, గోపాల్నాయక్, లాల్సింగ్, గోపాల్, కరుణాకర్, భిక్షపతి, రాజశేఖర్, కృష్ణగౌడ్, యాదరావు పాల్గొన్నారు.
డిగ్రీ అయిపోయిన వెంటనే ఉద్యోగ ప్రయత్నం చేయాలని ఉండేది. ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన ఉద్యోగ మేళాకు వచ్చాను. ఈ క్రమంలో మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మొదట చిన్న ఉద్యోగంతో ప్రారంభించి, మున్ముందు మంచి స్థాయిలో నిలవాలన్నదే నా కోరిక. కానీ నేను ఊహించని విధంగా నెలకు రూ.35వేల జీతం ఆఫర్ వచ్చింది.
– బాణోత్ బాబియా, కొచ్చెరువు తండా, హవేళీఘనపూర్
రామాయంపేట, ఆగస్టు 17: మెదక్లో ఎమ్మెల్సీ ఆధ్వర్యం లో నిర్వహించిన జాబ్మేళాలో రామాయంపేట మండలానికి చెందిన గిరిజన యువతికి ఉద్యోగం లభించింది. మెదక్ జిల్లా కేంద్రంలోని సాయిబాలాజీ గార్డెన్లో ఎమ్మెల్సీ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించిన జాబ్మేళాలో కాట్రియాల గిరిజన తండాకు చెందిన యువతి మూడావత్ ప్రగతి ఇంటర్వ్యూకు హాజరైంది. దీంతో సురక్షా దవాఖాన సిబ్బంది ప్రగతిని ఎంపిక చేసింది. తమ దవాఖానలో చేరాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో నియామక పత్రం అందజేశారు. ప్రగతికి నెలకు రూ.30వేల జీతం ఇస్తామని అక్కడే ప్రకటించారు. దీంతో ప్రగతి తల్లిదండ్రులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీకి జీవిత కాలం రుణపడి ఉంటామని వారు తెలిపారు.