మర్కూక్, అక్టోబర్ 17: గ్రామ కంఠం భూములకు త్వరలోనే భూ యజమాన్య పట్టాలు పంపిణీ చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు అన్నారు. సోమవారం మండలంలోని అంగడికిష్టాపూర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. అంగడికిష్టాపూర్ గ్రామాన్ని గ్రామకంఠం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సర్వే నిర్వహించారు. అందులో భాగంగానే గ్రామస్తులతో కలిసి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామకంఠం భూములకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారని, ఇందుకోసం పైలెట్ ప్రాజెక్టుగా అంగడికిష్టాపూర్ గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు.
రెండు నెలలుగా గ్రామంలో అధికారుల బృందం సర్వే నిర్వహించిందని, అలాగే డోన్ కెమెరా ద్వారా హద్దులను గుర్తించామని, వాటిని గ్రామస్తుల సమక్షంలో విచారించి హద్దులు నిర్ణయిస్తామన్నారు. గ్రామస్తులు సర్వేకు సహకరించారని కోరారు. అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు గ్రహిత అంగడికిష్టాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు ఓంకార్ రాధాకృషతో పాటు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు రామకృష్ణరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీరాములు గౌడ్, ‘గడా’ అధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో విజయేందర్రెడ్డి, డీపీవో దేవికీదేవి, డీఎల్పీవో వేదావతి, ఎంపీటీసీ నరేందర్, ఉపసర్పంచ్ కొండల్రెడ్డి, తహసీల్దార్ భవానీ, ఆర్ఐ బాలకృష్ణ, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, కార్యదర్శి రేఖ, నాయకులు నర్సింహులు, కనకయ్య, బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.