గవర్నర్ తమిళిసై రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్ర సత్యనారాయణ, దాసోజు శ్రవణ్కుమార్ల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకుల డైరెక్షన్లో గవర్నర్ పనిచేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్లో పనిచేస్తున్నారన్న కారణంతో ఇద్దరి అభ్యర్థిత్వాలను ఆమోదించకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. కమలం పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఒక విధానం.. మిగతా రాష్ర్టాల్లో మరో విధానం అవలంబిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
– పటాన్చెరు, సెప్టెంబర్ 26
పటాన్చెరు, సెప్టెంబర్ 26: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ బీజేపీ నాయకురాలిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆరోపించారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీలుగా కుర్ర సత్యనారాయ
ణ, దాసోజు శ్రవణ్కుమార్ల అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడంపై విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు. కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకుల డైరెక్షన్లోనే గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఎస్టీ నాయకుడిగా, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడం సరైంది కాదన్నారు. నలబై ఏండ్లుగా ప్రజా సేవలో, కార్మికుల సంక్షేమం కోసం శ్రమిస్తున్న వ్యక్తి సత్యనారాయణ అన్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఆదర్శ రాజకీయాలు చేశారన్నారు. సీఎం కేసీఆర్ ఆయన సామాజిక సేవా దృక్పథాన్ని చూసే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారన్నారు. గతంలో గవర్నర్ కూడా పార్టీ పదవులు నిర్వర్తించారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్లో పని చేస్తున్నారన్న కారణంతోనే వారిద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తే, ఒక రాజకీయ పార్టీకి ఉపాధ్యక్షురాలిగా చేసిన వ్యక్తిని గవర్నర్గా నియమించడం సబబా అని ప్రశ్నించారు. తమిళిసై గవర్నర్లా కాకుండా బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమిళిసై మొదటి నుంచి తెలంగాణ ప్రగతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే పలు కీలక బిల్లులను గవర్నర్ నిలిపివేసి ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు. గిరిజన, ఓబీసీ నాయకులకు పదవులు రాకుండా అడ్డుకోవడం సబబుకాదన్నారు.
సుబ్రహ్మణ్యస్వామిని రాజ్యసభకు ఎలా నామినెట్ చేశారో గవర్నర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సర్కారియా కమిషన్ ప్రకారం గవర్నర్ పదవిలో తమిళిసై ఉండకూడదని, ఇప్పుడు ఎలా ఉన్నారో చెప్పాలన్నారు. బీజేపీ నేత గులాం అలీని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపలేదా? మహేశ్జెఠ్మాలానీ, సోనాల్ మాన్సింగ్, రాకేశ్ సిన్హా కమలం పార్టీలో పనిచేయడం లేదా అని నిలదీశారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ నేతలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఒక విధానం, వారితో కలిసిరాని రాష్ర్టాల్లో మరో విధానమా? అని ప్రశ్నలు సంధించారు. ఆర్టీసీ బిల్లుకు కూడా గవర్నర్ ఆపి ఇబ్బందులు సృష్టించారన్నారు.
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా వెన్నవరం భూపాల్రెడ్డిని నియమిస్తూ సీఎం కేసీఆర్ పంపించిన బిల్లును సైతం గవర్నర్ ఆమెదించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై పునరాలోచించి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమోదించాలని కోరారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్లు మెట్టు కుమార్యాదవ్, సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్యాదవ్, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, సీనియర్ నాయకులు కొలన్బాల్రెడ్డి, వెంకటేశంగౌడ్, ఆంజనేయులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాం డు, దశరథ్రెడ్డి, వెంకట్రెడ్డి, ఆదర్శ్రెడ్డి, రాజన్సింగ్, భిక్షపతి, చంద్రశేఖర్, శ్రీధర్చారి, ప్రభాకర్గుప్తా ఉన్నారు.