నిజాంపేట/మెదక్ : అన్నదాతల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన భారత్ పెట్రోల్ బంక్ను వారు ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు.
ప్రజల సంక్షేమానికే ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని, దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తు వారి అభివృద్ధికి నిరంతరం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రైతుల పక్షపాతి సీఎం కేసీఆర్ అన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు,జడ్పీటీసీ విజయ్కుమార్,టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి,మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్,మాజీ ఎంపీపీ సంపత్,నిజాంపేట పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి,మండల సర్పంచులు కవిత,అమరసేనారెడ్డి,ఎంపీటీసీలు బాల్రెడ్డి,రాజిరెడ్డి,టీఆర్ఎస్ నాయకులు నగేశ్,విజయ్,యాదగిరి,నర్సింహులు,ఎల్లం,రాజు,లక్ష్మన్,రవి గ్రామస్తులు ఉన్నారు.