వెల్దుర్తి/ శివ్వంపేట/ కొల్చారం/ చేగుంట, మే 5 : రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నట్లు నర్సా పూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. మారుమూల గ్రామాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు మద్దతు ధర ఇస్తున్నదని పేర్కొన్నారు. వెల్దుర్తి మండల పరిధిలోని మహ్మద్నగర్తండాలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ప్రభు త్వం అన్నివిధాలా ఆదుకుంటూ రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు. వ్యవసాయ రంగానికి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తారని, పంట నష్టం వాటిల్లిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంద ని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వెల్దుర్తి పం చాయతీ శేరీలలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ భాగ్య మ్మ, ఎంపీటీసీ మోహన్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమం లో ఆత్మకమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, సర్పంచ్ సుజాత, నాయకుడు నరేందర్రెడ్డి, ఏపీఎం శంకరయ్య పాల్గొన్నారు.
చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం
శివ్వంపేట మండలకేంద్రంతోపాటు చిన్నగొట్టిముక్ల గ్రా మాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతుధర పొందాలన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సర్కార్ పని చేస్తుందని గుర్తుచేశారు. తడిసిన ధాన్యం సైతం తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని, అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యాన్ని తూకం వేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, సర్పంచ్లు శ్రీనివాస్గౌడ్, బాలమణీనరేందర్, ఎంపీటీసీ నువ్వుల దశరథ, బీఆర్ఎస్ నాయకుల కొడకంచి శ్రీనివాస్గౌడ్, రాజశేఖర్గౌడ్, వీరస్వామి, కల్లూరి వెంకటేశ్, ఏవో లావణ్య, ఐకేపీ ఏపీఎం వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ సీఈవో మధు ఉన్నారు.
ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలి
కొల్చారం మండలంలోని తుక్కాపూర్లో ఏర్పాటు చేసిన రంగంపేట పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ మాధవితో కలిసి డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగె రమేశ్ ప్రారం భించారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు. కార్యక్రమంలో సీఈవో నవీన్, నాయకులు ఆంజనేయిలు, శ్రీశైలం పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే లక్ష్యం : ఎంపీపీ శ్రీనివాస్
చేగుంట మండలంలోని మక్కరాజిపేటలో ఐకేపీ కొను గోలు కేంద్రాన్ని ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్, ఎంపీటీసీ బండి కవితావిశ్వేశ్వర్తో కలిసి ఎంపీపీ మా సుల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభు త్వం కొనుగోలు చేస్తుందన్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో రైతులుధాన్యం విక్రయించాలని సూచించారు. ధాన్యంలో తాలు, రాళ్లు లేకుండా పూర్తిగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. ధాన్యం విక్రయించిన వారం రోజుల్లోనే ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీసీ అంజ్యానాయక్, మహిళా సంఘం అధ్యక్షురాలు సునీత, స్థానిక నాయకుడు సురేశ్రెడ్డి ఉన్నారు.
ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలి
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తూకం వేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. మెదక్ మండలం మాచవరంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ధాన్యంపై టార్పాలిన్లు కప్పాలని సూచించారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి, నాణ్య తా ప్రమాణాలకు అనుగుణంగా తేవాలని సూచించారు. కొనుగోలు కేంద్రానికి ప్యాడీ క్లీనర్ యంత్రాన్ని పంపిస్తామన్నారు. నిర్వాహకులు ధాన్యం సేకరణ వివరాలను ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సీతారామయ్య, సీఈవో శ్రీకాంత్ ఉన్నారు.