సిర్గాపూర్, నవంబర్ 30: ప్రభుత్వ బడులు నూతన శోభను సంతరించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాల భవనాలకు ఒకే రంగులో ఉండాలని ప్రభుత్వం కామన్ కలర్ కోడ్ను రూపొందించింది. ఈనేపథ్యంలో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులు ముగించుకున్న వాటికి కామన్ కలర్ కోడ్ను అమలు పరుస్తున్నారు.
మండలంలో కడ్పల్, ఖాజాపూర్, లక్ష్మణ్నాయక్తండా, కిషన్నాయక్తండా కలర్ పెయింట్స్ పనులను పూర్తి చేసినట్లు ఎంఈ వో శంకర్ తెలిపారు. మిగతా ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు.