జహీరాబాద్, మే 28 : సర్కార్ బడులను కార్పొరేట్ కు బడులకు దీటుగా తీర్చిదిద్ధేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. ప్రైవే ట్ పాఠశాలకు దీటుగా సర్కార్ పాఠశాల్లో ఆకర్షణీయం గా ఆహ్లాదంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం నిర్వహిస్తున్నది. కా ర్యక్రమంలో భాగంగా జహీరాబాద్ మండలంలో చిరాగ్పల్లి, బుచినెల్లి, బుర్థిపాడు, భరత్నగర్, కాశీంపూర్, అర్జున్నాయక్తండా, హోతి(బి), రంజోల్, హుగ్గెల్లి, శేకాపూర్, మల్చల్మా, పుకట్నగర్, కసాబ్గల్లీ, గుల్షన్నగర్, డైవర్ కాలనీ, గడిమహల్, శాంతినగర్, సుభాశ్గంజ్, హైమద్నగర్, జహీరాబాద్ బాలికలు, బాలుర పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి సకల సౌకర్యాలతో కూడిన బోధన అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఇందు లో భాగంగానే తొలి విడుతలో ఎక్కువ మంది విద్యార్థులున్న బడులను ఎంపిక చేసి పనులు చేస్తున్నారు. ఎంపిక చేసిన బడుల్లో అన్ని హంగులతో సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. దీంతో జూ న్ వరకు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నా యి. ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయలు కలిపించేందుకు గ్రామ సర్పంచు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్, పంచాయతీరాజ్ ఏఈలతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.
సౌకర్యాలు కలిపించేందుకు నిధులు విడుదల
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కలిపించేందుకు ‘మనఊరు-మనబడి’ పథకం ఏర్పాటు చేసి పాఠశాలలను ఎంపిక చేశారు. పాఠశాలల అభివృద్ధి అంచనా వ్యయంలో కొంత మొత్తం నిధులు రివాల్వింగ్ ఫండ్ రూపంలో ప్రభుత్వం విడుదల చేసింది. దీనిలో 1/3 వంతు నిధులు ఖర్చు చేయగానే తిరిగి అంతమేరకు ఎంబీ రికార్డు ఆధారంగా నిధులను విడుదల చేస్తారు. పాఠశాల నిర్వహణ కమిటీ తీర్మానం చేసి నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాఠశాలలకు కేటాయించిన నిధులతో వస్తువులను ఏజెన్సీ ద్వా రా కాంట్రాక్ట్ పద్ధతిలో రాష్ట్ర స్థాయిలోనే కొనుగోలు చేస్తారు. డ్యూయల్ డెస్క్ బెంచిలు, డిజిటల్ తరగతుల వస్తువులు, పెయింట్లు, ఆకు పచ్చబ్లాక్ బోర్డులు, ఫర్నీచర్, సైన్స్ పరికరాలు కొనుగోలు చేస్తారు.
పాఠశాల భవనలకు మరమ్మతులు
మనఊరు-మనబడికి ఎంపికైనా పాఠశాలలో పను లు జోరుగా సాగుతున్నాయి. రంజోల్ పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న పాత పాఠశాల భవనన్ని కూల్చివేశారు. కొత్తగా భవనలకు మరమ్మతులు చేస్తున్నారు. చిరాగ్పల్లి పాఠశాలలో తాగునీటి సమస్య పరిష్కారం చేసేందుకు బోరు బావిని తవ్విం చారు. ప్రతి పాఠశాలలో పనులు జోరుగా సాగుతున్నాయి. జూన్ మాసంలో పనులు పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఆధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.
రంజోల్ పాఠశాలలో మరమ్మతులు
ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. పాఠశాల భవనాలకు మరమ్మతులు చేయడంతో విద్యుత్ సౌకర్యం, తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మాణం చేస్తున్నారు. పాఠశాల అవరణలో ప్రమాదకరంగా ఉన్న పాత భవ నం తొలగించాము.
– సత్యం ముదిరాజ్, రంజోల్
మౌలిక సౌకర్యాలు కస్తున్నాం..
మనఊరు-మనబడి కార్యక్రమం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నాము. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన చేసే అవకాశం ఉంటుంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మౌలిక సదుపాయలు కలిపిస్తున్నాము.
– కోటేశ్వర్రావు, పీఆర్ ఏఈ జహీరాబాద్
నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది
ప్రభుత్వం పాఠశాలలో మౌలి క సదుపాయలు కలిపించేందుకు కృషి చేస్తున్నది. మౌలిక సదుపాయలు కలిపించేందుకు నిధులు మంజూరు చేయడం సంతోషం గా ఉంది. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా సర్కార్ బడు లు నిర్మాణం చేయడంతో పేద విద్యార్థులకు ఎంతో మేలు కలుగనున్నది.
– తుకారం, పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ) చైర్మన్ చిరాగ్పల్లి