జగదేవ్పూర్, జనవరి 16: తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాచర్ల నరేశ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కేసీఆర్ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పల్లెల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేయించారని గుర్తుచేశారు.
ప్రపంచ స్థాయిలో రాణించేందుకు క్రీడాకారులకు అన్ని అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జగదేవ్పూర్లో కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని నెల రోజులపాటు రాష్ట్రస్థాయి కేసీఆర్ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేసి యువతకు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ముందుకు వచ్చిన నరేశ్ను వారు అభినందించారు. పలు జిల్లాల నుంచి 40 టీంలు వచ్చాయని, అన్ని రకాల ఏర్పాట్లు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ పుట్టినరోజు ఫైనల్ పోటీలు నిర్వహించి మొదటి బహుమతి రూ.50 వేలు, రెండో బహుమతి రూ.25 వేలు ఇవ్వనున్నామన్నారు. అంతకు ముందు క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడారు.
కార్యక్రమంలో ఎంపీపీ బాలేశంగౌడ్, ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండారంగారెడ్డి, గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా, మండల అధ్యక్షుడు కిరణ్గౌడ్, కావ్యా దుర్గయ్య, స్థానిక ఎంపీటీసీ కవితాశ్రీనివాస్రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు బుద్ద నాగరాజు, వార్డు మెంబర్ల ఫోరం మండల అధ్యక్షుడు సత్యం, ఎస్సై కృష్ణమూర్తి, మండల కోఆప్షన్ మాజీ సభ్యుడు మునీర్, పలు గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు.