రైతులు దళారులను నమ్మి నష్టపోవద్దని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్ పల్లె పల్లెలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, ప్రతి రైతు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరకు విక్రయించాలని సూచించారు. తేమ శాతం చూసుకున్నాకే ధాన్యం తీసుకురావాలని, పంట డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అన్ని విధాలా అండగా ఉంటుందని అన్నారు.
సంగారెడ్డి/ కొండాపూర్/ సదాశివపేట, నవంబర్ 4: రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి మండలంలోని కోత్లాపూర్, కలబ్గూర్లలో ఐకేపీ, నాగాపూర్, ఇస్మాయిల్ఖాన్పేట (ఈశ్వారపురం)లలో సహకర వ్యవసాయ పరపతి సంఘాలు మొత్తం 4 కొనుగోలు కేంద్రాలను, కొండాపూర్ మండల కేంద్రంతో పాటు తొగర్పల్లి, మల్కాపూర్, గొల్లపల్లి గ్రామాల్లోని సొసైటీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అంతేకాకుండా సదాశివపేట మండల పరిధిలోని కొల్కూర్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం దగ్గరలోనే కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తుందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే సమయంలో ముందుగా తేమశాతం లేకుండా కేంద్రాలకు తరలించాలన్నారు.
ధాన్యానికి సరిపడా గన్నీ బ్యాగులు, తాలు తీసే యంత్రం అందుబాటులో వ్యవసాయ అధికారులు ఉంచారని గుర్తు చేశారు. రైతులు ఇబ్బందులకు గురి కాకుండా ఒకవేళ వర్షం వస్తే ధాన్యంపై కప్పడానికి టార్ఫాలీన్లు అధికారులు సిద్ధంగా ఉంచారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, పీఏసీఎస్ చైర్మన్ రాంగోపాల్, ఆయా గ్రామాల సర్పంచులు అమృత రాజు, మంజుల పండరినాథ్ గౌడ్, కంది జడ్పీటీసీ కొండల్రెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, ఎంపీపీ లావణ్య, అధికారులు తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీవో రవీందర్, మండల వ్యవసాయ అధికారి ఏవీజీకే ప్రసాద్, ఆర్ఐ ప్రవీణ్రెడ్డి, ఏపీఎం వెంకట్, నాయకులు చక్రపాణి, మనోహర్గౌడ్, మల్లయ్యగౌడ్, యావర్, ప్రేమానందం, పండరినాథ్గౌడ్, దుర్గేశ్గౌడ్, సాయి, శ్రీనివాస్, కొండాపూర్ మండలంలో జరిగిన కార్యక్రమాల్లో మండల జడ్పీటీసీ పద్మావతీ పాండురంగం, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రుక్ముద్దీన్, రైతుబంధు మండలాధ్యక్షుడు మల్లేశం, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, వైస్ ఎంపీపీ లక్ష్మీరాంచందర్, సొసైటీ చైర్మన్లు శ్రీకాంత్రెడ్డి, మాణిక్రెడ్డి, రాజు, పవన్ కుమార్, ఎంపీటీసీలు శ్రీనివాస్గౌడ్, రాందాస్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, నాయకులు శ్రీధర్రెడ్డి, మల్లాగౌడ్, నాగేశ్, గోవర్ధన్రెడ్డి, రఘునాథ్రెడ్డి, ప్రభుదాస్, కుమార్, రాము, తహసీల్దార్ ఆశాజ్యోతి, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, ఆర్ఐ ఏవో, మాజీ సర్పంచ్లు సత్యానందం, రవి, సదాశివపేట మండల కార్యక్రమంలో ఎంపీపీ తొంట యాదమ్మ కిష్టయ్య, స్థానిక సర్పంచ్ భూపాల్రెడ్డి, సొసైటీ చైర్మన్ రత్నాకర్రెడ్డి, తహసీల్దార్ మనోహర్చక్రవర్తి, వ్యవసాయశాఖ అధికారి అనిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, ఎంపీటీసీ మాధవరెడ్డి, సీనియర్ నాయకులు మల్లాగౌడ్, శ్రీనివాస్రెడ్డి, అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.