పటాన్చెరు, డిసెంబర్ 3: పటాన్చెరు పఠాన్గా గూడెం మహిపాల్రెడ్డి నిలిచారు. వరుసగా మూడోసారి గెలిచి పటాన్చెరు నియోజకవర్గంలో చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే రెండోసారి గెలవలేదు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి గెలిచారన్న వార్తతో బీఆర్ఎస్ శ్రేణు ల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఆట, పాటలతో ధూంధాం చేశారు. పటాకులు కాల్చి సంబురాలు చేశారు. శుభాకాంక్షలతో సందడి చేశారు. ‘జై కేసీఆర్.., జైజై జీఎమ్మార్..’ నినాదాలతో గీతం ప్రాంగణం దద్దరిల్లింది. ఆదివారం పటాన్చెరు మండలం రుద్రారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన శాసనసభ స్థానాల ఓటింగ్ కౌంటింగ్లో బీఆర్ఎస్ పటాన్చెరు అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డి తన సమీప కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి కాట శ్రీనివాస్గౌడ్పై 7వేల ఓట్లతో గెలుపొందారు. 23 రౌండ్లపాటు జరిగిన లెక్కింపులో అధికశాతం రౌండ్లలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి స్వల్ప ఆధిక్యత కనిపించింది. 22 రౌండ్లు ముగిసే వరకు 7వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి 7091 ఓట్ల అధిక్యత వచ్చింది. గూడెం మహిపాల్రెడ్డికి 1లక్షల 5వేల 387 ఓట్లు పడ్డాయి. కాట శ్రీనివాస్గౌడ్కు 98వేల 296 ఓట్లు పోలయ్యాయి. మూడో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నిలిచారు. ఆయనకు 46వేల 162 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నందీశ్వర్గౌడ్కు 19వేల 963 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం ఆధిక్యతను చాటారు. ప్రతి రౌండ్లో స్వల్పంగా ఓట్లు పెరుగుతూ పోయాయి. 23వ రౌండ్కు 7వేల ఓట్ల ఆధిక్యతతో ఎమ్మెల్యేగా ముచ్చటగా మూడో మారు గూడెం మహిపాల్రెడ్డి గెలిచారు.
ఎన్నికల సంఘం, అధికారులు ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్రెడ్డి గెలిచారని ప్రకటించేందుకు సిద్ధమవుతున్న సమయంలో తమకు అధికంగా ఓట్లు వచ్చాయని, కొన్ని ప్రాంతాల్లో జరిగిన కౌంటింగ్లో తప్పులు దొర్లాయని కాంగ్రెస్ అభ్యర్థి సతీమణి కాట సుధారాణి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొన్ని గంటల పాటు ఎన్నికల విజ యం ప్రకటన నిలిచిపోయింది.
చివరికి అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వడంతో విజేతగా గూడెం మహిపాల్రెడ్డిని ప్రకటించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి సర్టిఫికెట్ను ఎన్నికల అధికారుల అందజేశారు.
రామచంద్రాపురం, డిసెంబర్ 3: పటాన్చెరులో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డి విజయం సాధించడంతో ఆర్సీపురంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పానగేశ్ ఆధ్వర్యంలో శ్రేణులు పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డిని మూడోసారి గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాకేశ్, ప్రీతిగౌడ్, మంజూల, కుమార్, ఖాజ, మహేశ్, సజ్జయాదయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
గుమ్మడిదల, డిసెంబర్ 3: తీన్మార్.. జీఎమ్మార్ అంటూ బీఆర్ఎస్ శ్రేణు ల సంబురాలు అంబరాన్నంటాయి. ఆదివారం గుమ్మడిదలతో పాటు బొం తపల్లి, అన్నారం, దోమడుగు, కానుకుంట, మంభాపూర్, అనంతారం, కొత్తపల్లి, నల్లవల్లి, రాంరెడ్డిబావి, వీరారెడ్డిపల్లి, వీరన్నగూడెం, నాగిరెడ్డిగూడెం గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో సంబురాలు చేసుకున్నారు. బొంతపల్లి కమాన్, కానుకుంట చౌరస్తాలతో పాటు పలు గ్రామా ల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పటాకులు కాల్చుతూ సంబురాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హ్యాట్రిక్ విజ యం సాధించడానికి కృషి చేసిన మండల ప్రజలకు ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి, జడ్పీటీసీ కుమార్గౌడ్, సీనియర్ నాయకుల గోవర్ధన్రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్రెడ్డి, సంతోష్రెడ్డి, సర్పంచ్లు చిమ్ముల నర్సింహారెడ్డి, రాజశేఖర్, ఆలేటి నవీనాశ్రీనివాస్రెడ్డి,శంకర్, కంజర్ల శ్రీనివాస్, హన్మంత్రెడ్డి, దీపానరేందర్రెడ్డి, వాసవిదామోదర్రెడ్డి, మమతావేణు, మురళీ తదితర నాయకులతో కలిసి పటాకులు కాల్చుతూ సంబురాలు చేశారు.
గుమ్మడిదల, డిసెంబర్ 3: పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డి ఘనవిజయం సాధించడంతో గుమ్మడిదల బీఆర్ఎస్ మండల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మూడోసారి విజయం సాధించడంతో ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి, జడ్పీటీసీ కుమార్గౌడ్, సీనియర్ నాయకులు గోవర్ధన్రెడ్డి, విజయభాస్కర్రెడ్డి, కొత్తపల్లి ప్రభాకర్రెడ్డి, సర్పంచ్లు ఆలేటి నవీనాశ్రీనివాస్రెడ్డి, రాజశేఖర్, నాయకులు అమ్మన్నగారి శేఖర్ తదితర నాయకులు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మం భాపూర్ సర్పంచ్ కంజర్ల శ్రీనివాస్, గ్రామకమిటీ అధ్యక్షుడు ప్రకాశ్, నాయకుడు శివకుమార్ తదితరులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపా రు. ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మతో ఎంపీపీ సద్దిప్రవీణావిజయభాస్కర్రెడ్డి కలిసి గులాబీరంగులు చల్లుకుని సంబురాలు చేసుకున్నారు.