జహీరాబాద్లో ప్రతి ఎకరాకూ కాళేశ్వర జలాలు ఇవ్వడంతో పాటు రెండేండ్లలో ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు హామీ ఇచ్చారు. శుక్రవారం జహీరాబాద్లోని పస్తాపూర్ చౌరస్తాలోని ఫంక్షన్హాల్లో నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బూత్ కమిటీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి స్థానిక వ్యక్తి, బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుకు భారీ మెజార్టీ తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఇక్కడి దళితులకు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలు ప్రాధాన్యత ఇవ్వకుండా స్థానికేతరులకు అవకాశం ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. జహీరాబాద్కు పక్కనే ఉన్న కర్ణాటకలో వ్యవసాయానికి ఎన్ని గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. ఇటీవల తాండూర్లో జరిగిన బహిరంగ సభలో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ 5 గంటలు ఇస్తున్నామని అబద్ధంతో ప్రజలను మభ్యపెట్టారని, కానీ.. అక్కడ 3 గంటలు ఇవ్వడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహులు పవన్కల్యాణ్, షర్మిల, చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, జహీరాబాద్ ప్రజలు మేల్కొని అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ను ఆదరించి మాణిక్రావును గెలిపించాలని కార్యకర్తలు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జహీరాబాద్, నవంబర్ 3 : జహీరాబాద్కు పక్కన కర్ణాటక రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని.. అక్కడ వ్యవసాయానికి ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారో? తెసుకుని వచ్చి బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ పస్తాపూర్ చౌరస్తాలోని ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. బూత్ కమిటీ నేతలు కష్టపడి జహీరా బాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుకు భారీ మెజార్టీ తేవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్లో నాయకులు లేరు, ఉన్న వారం దరూ సీఎం అభ్యర్థులని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంచి పని చేస్తే వికారాబాద్లో పోటీ చేసి గెలిచేవారు, కానీ, జహీరాబాద్కు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. వికారాబాద్ ఎస్సీ రిజర్వేషన్ స్థానం ఉంది.. కాంగ్రెస్ అభ్యర్థి ఏ పార్టీ నుంచి వచ్చిన్నారో తెసుకోవాలన్నారు. వికారాబాద్లో మూడు సార్లు ఓడిపోవడంతో పెద్దపల్లికి వెళ్లి పోటీ చేసినా.. అక్కడ ఓడిపోయా రని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ స్థానిక దళిత నాయ కులకు టికెట్ ఇవ్వకుండా స్థానికేతరులకు ఎందుకు ఇచ్చారని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్థానిక వ్యక్తి మాణిక్రావుకు టికెట్ ఇచ్చిందని, ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. జహీరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి ఇప్పుడు జరు గుతున్న ఎన్నిక పరీక్ష అన్నారు. శాసనసభ ఎన్నికల్లో మాణిక్ రావును గెలించి, జహీరాబాద్ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలనికోరారు. మాణిక్రావును గెలిపించాలని.. మీ పనులన్నీ నేను చేస్తానని మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికలు జరగలేదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి.. కష్ట పడినవారికి కౌన్సిలర్గా ఆవకాశం కల్పిస్తామన్నారు. జహీరాబాద్ ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా నా వద్దకు రావచ్చనిసూచించారు. జహీరాబాద్ నాయకులు మౌనం వీడి బీఆర్ఎస్ విజయానికి పని చేయాలన్నా రు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి, హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ కావడం ఖా యమన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభు త్వం వస్తుంది.. జహీరాబాద్లో ఎమ్మెల్యేగా మాణిక్రావును గెలిపించాలని కోరారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. గత ఎన్నికల్లో సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారని, ఈ సారి బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజార్టీ సాధించడం ఖాయమన్నారు. ఉమ్మడి జిల్లాలో పది స్థానాలను గెలిచి, సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇస్తామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గీతారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచా రని, అప్పుడు జహీరాబాద్లో తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక వసతులు ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ హయంలో జహీరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొగుడంపల్లిని కొత్త మండలం చేసి, జహీరాబాద్ను డివిజన్ కేంద్రం చేసిందన్నారు. జహీరాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన వెంటనే కాళేశ్వరం నీటిని ప్రతి ఎకరానికి అందిస్తామన్నారు. సింగూరు ప్రాజెక్టు వద్ద ఎత్తిపోతల పనులు జరుగుతున్నాయని, రెండేండ్లలో సంగమేశ్వరా ఎత్తిపోతల పను లను పూర్తి చేస్తామన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
జహీరాబాద్కు పక్కన కర్ణాటకలో వ్యవసాయానికి ఎన్ని గం టల కరెంట్ ఇస్తున్నారో తెలుసుకోవాలి.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వికారాబాద్ జిల్లా తాండూర్కు వచ్చి కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని తెలిపారన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణకు వచ్చి, 5 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నామని చెప్పడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గు చేటన్నారు. జహీరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే కర్ణాటక పరిస్థితి వస్తుందన్నారు. కర్ణాటకలో 5 గంటలు కాదు.. 3 గంటల కరెంట్ ఇస్తున్నారని.. ఎవరికైనా అనుమానం ఉంటే బీదర్ వెళ్లి చూడాలన్నారు.
తెలంగాణ వ్యతిరేకులు పవన్ కల్యాణ్, షర్మిలతో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనిమంత్రి హరీశ్రావు విమర్శించారు. ఎన్నికల్లో తెలంగాణ ద్రోహులకు తగ్గిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, టీఎస్ఐడీసీ చైర్మన్ తన్వీర్, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శివకుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, రైల్వే బోర్డు సభ్యుడు షేక్ ఫరీద్, టెలికం బోర్డు సభ్యుడు పవార్ శంకర్నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండప్ప, ఝరాసంగం, న్యాల్కల్ జడ్పీటీసీలు వినీలానరేశ్, స్వప్నభాస్కర్, మహిళా నాయకురాలు స్రవంతిరెడ్డి, సరస్వతిరెడ్డి, మంజుల, అనూషమ్మతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పేద ప్రజల కోసం మంచి మ్యానిఫెస్టో ఏర్పాటు చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలపై నమ్మకంతో మంచి మ్యానిఫెస్టో ఏర్పాటు చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 48 లక్షల మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నామని, జహీరాబాద్లో 45 వేల మంది పింఛన్లు అందించడం జరిగిందన్నారు. రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే జనవరి నుంచి పేదలకు సన్నబియ్యం సరఫరా చేస్తామన్నారు. రైతులకు రైతుబం ధు ద్వారా ఎకరానికి రూ. 16వేల పెట్టుబడి డబ్బులు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో పెట్టారన్నారు. యాసంగి పంటలకు రైతుబంధు ఇవ్వరాదని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకూ రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించిందన్నారు. బీఆర్ఎస్ ఎకరాకు రూ. 16వేలు చెల్లిస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర భారీ గా పెంచిందని, మహిళల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 400 సిలిండరు ఇస్తుందన్నారు. మహిళలు తాగునీటికి కష్టపడొద్దని ప్రతి ఇంటికీ మిషన్ భగీరథతో తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. అసైన్డ్ భూములపై లబ్ధిదారులకు పూర్తి హక్కు కల్పించడానికి బీఆర్ఎస్ కృషి చేస్తుందన్నారు. భూమి ఉన్న రైతులు రైతుబీమా కల్పించి రూ. 5లక్షల ఆర్థికసాయం చేస్తుందన్నారు. భూమి లేని ప్రతి ఇంటికీ బీమా సౌకర్యం క ల్పిస్తామని తెలిపారు. జహీరాబాద్లో 10వేల మందికి ఇంటి స్థలాలను పంపిణీ చేసి, ఇండ్ల నిర్మాణానికి ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. ప్రజలు ఆలోచన చేసి ఓట్లు వేయాలన్నారు.
సీఎం కేసీఆర్ సెక్యులర్ వ్యక్తి అని, బీజేపీతో కలిసే ఆవకాశం లేదన్నారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదన్నా రు. రాజగోపాల్రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చి పోటీ చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను ఓడిం చే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. జహీరాబాద్లో ముస్లింలకు షాదీఖాన, హజ్ భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఫరీదుద్దీన్ ఆత్మ శాంతించాలంటే మాణిక్రావును భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ నేతలు 25 రో జులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలన్నారు. నిమ్జ్ నిర్మాణంతో స్థానికులకు ఉపాధి ఆవకాశాలు వస్తాయని తెలిపారు.
కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర్ వద్ద బాగా డబ్బులు ఉన్నాయంటా.. ఓటుకు రూ. 2వేలు ఇస్తామని ప్రచారం చేస్తున్నారని తెలిసింది.. కానీ, ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు కు ఓట్లేయాలని మంత్రి హరీశ్రావు కోరారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థు లు బిర్యానీ, బీరుకు అమ్ముడుపోతారని మాట్లాడుతున్నారని, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన విద్యార్థులపై తప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. తెలంగాణ ద్రోహి రేవంత్రెడ్డికి గుణపాఠం తప్పదన్నారు.