గజ్వేల్, మే 31: ఈ సీజన్లో ధాన్యం అనుకున్న దానికంటే 30శాతం ఎక్కువగా రావడంతో కొనుగోలు సమస్యలు తలెత్తాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన గనుల మంత్రి గడ్డం వివేక్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఐవోసీ సమావేశ మందిరంలో 1053 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు రూ. 2.56 కోట్లతో నిర్మించిన బస్వేను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించి రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులెవ్వరూ ఆందోళన చెందొద్దని మంత్రి గడ్డం వివేక్ సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, ఆర్డీవో చంద్రకళ, గజ్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ చందన, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.