సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 8: నంగునూరు మండలం రాజగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ ఫైరింగ్లో పోలీస్ అధికారులకు 9 ఎంఎం పిస్టల్, రివాల్వర్, ఎస్ఎల్ఆర్ వెపన్స్తో ఫైరింగ్ చేయించారు. ఫైరింగ్ విధానాన్ని ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాసరావులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ అనురాధ మాట్లాడుతూ అధికారులు, సిబ్బందికి నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంతో పాటు వ్యూహాత్మకం గా ఆలోచించడం నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
పోలీసులు ఆత్మవిశ్వాసంతో విధులు నిర్వర్తించేందుకు, సమీపం నుంచి ప్రత్యర్థిని ఎదుర్కోవడం, ముష్కరులను నిరాయుధులను చేయ డం, వ్యూహంతో తలపడడం, స్కిల్ డెవలప్మెంట్ అంశాల గురిం చి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఫైరింగ్లో ఏసీపీలు సతీశ్, రమేశ్, సురేందర్రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.