దుబ్బాక, నవంబర్ 10: ఉద్యమాల పురిటి గడ్డ దుబ్బాక.. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.. సీఎం కేసీఆర్ విద్యనభ్యసించిన నేల. ఎందరికో రాజకీయ ప్రస్థానాన్ని అందించిన చైతన్య వేదిక. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బలమైన క్యాడర్ ఉంది. దీంతో ఈ గడ్డ గులాబీ అడ్డాగా మారింది. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి బరిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటనకు ముందుగానే..దుబ్బాక అభ్యర్థిగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేరు ఖరారు చేయడం విశేషం. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం, సీఎం కేసీఆర్ సూచనల మేరకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ మరోపక్క పార్టీ శ్రేణులకు అండగా ఉంటున్నారు. మృధుస్వభావి, నిస్వార్థ నాయకుడిగా ప్రభాకర్రెడ్డి విశేష ప్రజాభిమానం పొందారు. రాష్ట్రంలోనే అత్యధికంగా లబ్ధిదారులు డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు పొందారు. మల్లన్న సాగర్తో నియోజకవర్గ రైతులకు శాశ్వతంగా సాగునీటి సమస్య పరిష్కారమైంది. ప్రభాకర్రెడ్డి గెలుపు కోసం బీఆర్ఎస్ శ్రేణులు దుబ్బాక నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నాయి. గ్రామాల్లో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకువెళ్తున్నారు.
దుబ్బాక నియోజకవర్గం మొదట రాజగోపాల్పేట పేరుతో ఉండేది. అనంతరం 1957లో నియోజకవర్గ పునర్విభజనలో దొమ్మాట నియోజకవర్గంగా ఏర్పడింది. మళ్లీ 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో దుబ్బాక నియోజకవర్గంగా మారింది. ఈ నియోజకవర్గంలో 1951లో తొలిసారిగా ఇక్కడ మోడల్ ఎన్నికలు నిర్వహించారు. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కేవీ నారాయణరెడ్డి కమ్యూనిస్టుల మద్దతుతో గెలిచారు.
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దొమ్మాట నియోజకవర్గం దుబ్బాకగా మారింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి తరపున చెరుకు ముత్యంరెడ్డికి టీడీపీ నుంచి టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్లో చేరి పోటీ చేయగా విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి గెలుపొంది, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ అభ్యర్థిగా సోలిపేట రామలింగారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2020లో ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతిచెందడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. రామలింగారెడ్డి మరణించిన 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం. ఆ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి సతీమణి సుజాతకు బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం కల్పించింది. ఆ ఎన్నికల్లో అతి స్వల్ప ఓట్లతో సుజాత ఓటమి చెందారు.
దుబ్బాక అసెంబ్లీ వివరాలు నియోజకవర్గం పేరు: దుబ్బా
జిల్లా: సిద్దిపేట
నియోజకవర్గం ఏర్పడింది: 2009 నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది.
మండలాలు: దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నార్సింగి, అక్బర్పేట-భూంపల్లి
మున్సిపాలిటీ: దుబ్బాక
ఓటర్ల వివరాలు: ప్రస్తుతం ఓటర్లు : 1,87,892
పురుషులు: 92,517, స్త్రీలు: 95,375
బీఆర్ఎస్ – సోలిపేట రామలింగారెడ్డి – 89,112
కాంగ్రెస్ – మద్దుల నాగేశ్వర్రెడ్డి – 26,691
బీజేపీ – మాధవనేని రఘునందన్రావు – 22,374
మహాకూటమి నుంచి టీజేఎస్-చిందం రాజ్కుమార్ – 2550
స్వతంత్ర అభ్యర్థి పోసాన్పల్లి మహిపాల్రెడ్డికి (ట్రక్కు గుర్తు) – 12,215
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి 62,500 ఓట్ల మెజార్టీ
బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్రావుకు – 63,352
బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు – 62,273
కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్రెడ్డి – 22,196
స్వతంత్ర అభ్యర్థి బండారు నాగరాజు (చపాతి రోలర్) – 3,489
బీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు 1079 ఓట్ల మెజార్టీ