గజ్వేల్ రూరల్, మే 20 : రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తుండడంతో నిరుద్యోగులకు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి చేయూతనిస్తున్నారు. అభ్యర్థులకు ఉచితంగా టెట్ శిక్షణను అనుభవజ్ఞులైన అధ్యాపకులతో అందిస్తున్నారు. 40రోజులుగా కొనసాగుతున్న ఉచిత శిక్షణలో సుమారు 300 మంది అభ్యర్థులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. అభ్యర్థులకు మధ్యాహ్నం, సాయంత్రం నిమ్మరసం, ఫ్రూట్ సలాడ్ అందజేస్తున్నారు. గజ్వేల్ పట్టణంలోని సంతోషిమాత దేవాలయ ప్రాంగణంలో ఉచిత శిక్షణ అందిస్తున్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధిస్తామని అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, జగదేవ్పూర్, మర్కూక్, వర్గల్, ములుగు, తూప్రాన్, కొండపాకతో పాటు దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట మండలాల్లోని ఆయా గ్రామాల అభ్యర్థులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు. జూన్ 12న నిర్వహించే టెట్ పరీక్షకు అభ్యర్థులకు అన్ని సబ్జెక్టులపై శిక్షణ ఇవ్వడంతో అధ్యాపకులు ఎప్పటికప్పుడు వారి సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్షకు సన్నద్ధం చేస్తున్నారు. ఆయా సబ్జెక్టులపై అభ్యర్థులకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయం త్రం 5 వరకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే వంద మందికిపైగా అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇవ్వగా, మిగతా అభ్యర్థులకు కూడా త్వరలోనే అందజేసేందుకు వంటేరు ప్రతాప్రెడ్డి సిద్ధమవుతున్నారు.
ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించాలి
ఉచిత టెట్ శిక్షణను సద్వినియోగం చేసుకొని ఎక్కువ సంఖ్యలో అభ్యర్థు లు టీచర్ ఉద్యోగాలు సాధించాలి. పేదలు వేల రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకోలేని వారికి చేయూతనిచ్చి అండగా నిలిచేందుకు ఉచితంగా టెట్ కోచింగ్ ఇప్పిస్తున్న. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో 50రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేస్తున్నాం.
-వంటేరు ప్రతాప్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్