రామచంద్రాపురం,మే7: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో అభ్యర్థులు చదువుకోవాలని, సమయాన్ని వృథా చేయకుండా ప్రతి క్షణం కోచ్ చెప్పే టిప్స్ని పాటిస్తు ఉండాలని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి అభ్యర్థులకు సూచించారు. శనివారం భెల్లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో సైబరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ నియామక పరీక్ష ఉచిత శిక్షణ శిబిరాన్ని డీసీపీ శిల్పవల్లి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు యువతకు గొప్ప అవకాశం వచ్చిందని, వేలాది జాబ్స్ నోటిఫికేషన్లను ప్రభు త్వం విడుదల చేయడం సంతోషకరమన్నారు.
యువత కష్టపడి చదివి ఉద్యోగాలను సాధించాలన్నారు. యువతను సక్రమమైన మార్గంలో నడిపించాలనే ఉద్ధేశంతో డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ నియామక ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో శంషాబాద్, బాలానగర్లో ఏర్పాటు చేశామని, ప్రస్తుతం భెల్లో ప్రారంభించామన్నారు. బీహెచ్ఈఎల్ వారి సహకారంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియాను చూస్తూ సమయాన్ని వృథా చేయోద్దని సూచించారు. ఫైరవీలకు ఏమాత్రం ఆస్కారం ఉండదన్నారు. రెండు నెలలు కష్టపడి చిదివితే మీ జీవితానికి బంగారు బాటలు పడుతాయని తెలిపారు.
ఈ శిక్షణ శిబిరంలో మంచి అనుభవజ్ఞులైన, సేవా దృక్పథం ఉన్న జనార్దన్రెడ్డి లాంటి చీఫ్ కోచ్ మీకు ఉండటం మీరు అదృష్టంగా భావించాలన్నారు. రాచకొండలో గతంలో ఏర్పా టు చేసిన శిక్షణ శిబిరంలో 700మంది అభ్యర్థులకు 650 మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని ఆమె గుర్తు చేశా రు. అనంతరం చీఫ్కోచ్తో పాటు ఏసీపీలు అభ్యర్థులను ఉద్ధేశించి మాట్లాడారు. కార్యక్రమంలో మియాపూర్, కూకట్పల్లి, మాదాపూర్ ఏసీపీలు కృష్ణప్రసాద్, చంద్రశేఖర్, రఘునందన్రావు, భెల్ జీఎంలు శ్రీనివాస్, వర్మ, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.