కల్హేర్, ఏప్రిల్ 8: తెలంగాణ ప్రజల గుం డెల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నది ముమ్మాటికీ నిజమని, పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు నిరాశ చెందారే తప్ప కాం గ్రెస్ మీద ప్రేమతో గెలిపించలేదని మాజీ స్పీక ర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవా రం మండలంలోని మాసాన్పల్లి ఎక్స్రోడ్డు సమీపంలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అధ్యక్షతన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల కల్హేర్, పెద్దశంకరంపేట్ మం డలాల ముఖ్యకార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ నారాయణఖేడ్లో పార్టీ అభివృద్ధికి కృషి చేసే నాయకులు, కార్యకర్తలు ఉన్నారన్నారు.
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, హామీల గురించి అందరికీ తెలుసని, అబద్ధాలు చెప్పిన సీఎం రేవంత్రెడ్డిని అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. నియోజకవర్గంలో సాగు నీరులేక పూర్తిస్థాయిలో పంటలు పం డించలేకపోతున్నారని మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఆయన స్పందించి కాళేశ్వరం నీటిని సింగూర్కు తరలించేందుకు బసవేశ్వర లిప్టుతో నియోజకవర్గంలో లక్ష 60వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. 50 టీఎంసీల సామర్థ్యం గల మల్లన్నసాగర్ నుంచి 18 కిలోమీటర్లు సొరంగం 200 మీటర్ల లోతుతో 6కిలోమీటర్లు కాల్వ నిర్మించి తరలించేందుకు పనులు చేపట్టారన్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బసవేశ్వర లిప్టును రద్దు చేయడం రైతుల నోట్లో మట్టికొట్టినట్లయిందని ధ్వజమెత్తారు. మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్రావు సహాయ సహకారాలతో మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి హయాంలోనే నారాయణఖేడ్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్శెట్కార్ ఒకసారి, బీజేపీ అభ్యర్థి బీబీపాటిల్ రెండుసార్లు ఎంపీగా గెలుపొంది నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీలేదని విమర్శించారు. పంటలు ఎండబెట్టే కాంగ్రెస్కు ఓట్లు ఎందుకు వేయాలో రైతులు ఆలోచించాలన్నారు.
బీఆర్ఎస్లో గెలుపొందిన కొందరూ కాంగ్రెస్లో చేరడం దుర్మార్గమని, రానున్న రోజుల్లో వారి బతుకులు బజారుపాలవుతాయని జోష్యం చెప్పారు. మనశక్తిని తక్కువ అంచనా వేసుకోకుండా గట్టిగా పోరాడితే ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ విజయం తథ్యమన్నారు. భూపాల్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని 60 ఏండ్లలో వెనుకబాటుకు గురిచేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో వందల కోట్ల నిధులతో మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడిక పనులు చేపట్టామని, 8 నూతన చెరువులు మంజూరు చేశామాన్నారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు గురుకులాలు, దవాఖానలు నిర్మించామన్నారు.
నల్లవాగు ప్రాజెక్టు కూడికాల్వ కింద యాసంగిలో బీబీపేట్, ఫత్తేపూర్, మార్డి, ఖానాపూర్ కే, కృష్ణాపూర్, ఇందిరనగర్, కల్హేర్ గ్రామాల రైతులు సాగు చేసిన పంటలకు సరిపడా నీరు ప్రాజెక్టులో ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో నీరందించక ఎండిపోయాయన్నారు. అనిల్కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో పొట్టకూటి కోసం ప్రజలు వలసలు వెళ్తున్నారన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం సంతోష్కుమార్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ను కట్ చేశారు.