మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతున్నదని, కాంగ్రెస్ నుంచి పార్టీలో చేరుతున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి, మెదక్ పట్టణ 5వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల ఆంజనేయులు, మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి భారీ మెజార్టీతో హ్యట్రిక్ విజయం సాధిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కృషితో మెదక్ జిల్లాలో కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కళాశాల, తదితర అభివృద్ధి పనులతో దినదినాభివృద్ధి చెందుతున్నదన్నారు.
-మెదక్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ)/ పాపన్నపేట