నిజాంపేట, జనవరి 23 : రసాయన ఎరువులతో వ్యవసాయం చేస్తున్న రైతు లు క్రమంగా సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు చూపాలని సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం నిజాంపేటలోని రైతువేదికలో మండల రైతులకు సేంద్రియ వ్యవసాయంపై నిర్వహించిన సమావేశంలో న రేందర్రెడ్డి పాల్గొని మాట్లాడారు.
పంటలకు జీవ ఎరువులను వినియోగిస్తూ వ్య వసాయం చేయాలన్నారు. అధికంగా పంట దిగుబడి పొందాలనే లక్ష్యంతో రైతులు తమ పంటలకు రసాయ న ఎరువులను వాడటం వల్ల భూసారం క్ర మంగా దెబ్బతింటుందని సూచించారు. సేంద్రియ ఎరువులతో నాణ్యమైన పంట వస్తుందని రైతులంతా ఈ మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. రైతుల అభివృద్ధియే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతువేదికలను ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం మండలంలోని నగరం తండాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు నరేందర్రెడ్డి రూ. 1.39లక్షలను చెక్కు రూపంలో ఎస్సై శ్రీనివాస్రెడ్డికి విరాళం అందజేశారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ పంజా విజయ్కుమార్, హార్టికల్చర్ అధికారి రచన, రామాయంపేట ఏవో రాజ్నారాయణ, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, మండల సర్పంచులు నర్సింహారెడ్డి, గేమ్సింగ్, రైతుబం ధు సమితి గ్రామ అధ్యక్షుడు చంద్రం, పీఏసీఎస్ డైరెక్ట ర్లు కిష్టారెడ్డి, శ్రీధర్రెడ్డి, ఏఈవోలు శ్రీలత, కావేరి, రైతు లు శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్రెడ్డి, భూమగౌడ్, దుర్గయ్య, నర్సింహులు, రాజిరెడ్డి, రవి ఉన్నారు.