పుల్కల్,జులై 21 : సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు పదిహేను రోజులుగా కొనసాగిన వరద కాస్త తగ్గు ముఖం పట్టింది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, గురువారం ఉదయం ఆరు గంటలకు వరకు ప్రాజెక్టులో 26.733 టీఎంసీల నీరు నిలువ ఉన్నది.
గడిచిన 24 గంటల్లో ప్రాజెక్టు లోకి 4045 క్యూసెక్కుల నీరు వచ్చినట్లు నీటి పారుదల శాఖ డిప్యూటీ ఈఈ నాగరాజు వెల్లడించారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు తగ్గడంతో ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో తగ్గిందని ఆయన తెలిపారు. జూలై నెలలోనే ప్రాజెక్టులోకి పెద్ద మొత్తంలో 8.733 టీఎంసీలు నీరు వచ్చిందన్నారు. పంట రైతులకు ఎలాంటి ఢోకా ఉండదని డిప్యూటీ ఈఈ తెలిపారు.