ఝరాసంగం : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని తుమ్మన్పల్లి ( Tummanpalli ) గ్రామంలో ఆదివారం ఒక పిచ్చికుక్క ( Dog Attack ) తీవ్ర అలజడి సృష్టించింది. గ్రామంలోని జనావాసాల్లోకి చొరబడి ఒక్కసారిగా ప్రజలపై విరుచుకుపడింది. ఈ దాడిలో గ్రామానికి చెందిన రిజ్వానా బేగం, చంటయ్య, యేసయ్య, విష్ణువర్ధన్రెడ్డి సహా మొత్తం ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు ( Injures) .
బాధితుల ముక్కు, నోరు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఝరాసంగం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అనంతరం అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం బాధితులను హైదరాబాద్కు తరలించారు.
అంతకుముందు శనివారం బొజ్జానాయక్ తండాకు చెందిన విశాల్ అనే యువకుడిపై ఇదే కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.మండలంలో పిచ్చికుక్కల దాడులు నిత్యకృత్యంగా మారాయని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ బర్దిపూర్, ఝరాసంగం, బొజ్జానాయక్ తండా, కుప్పానగర్ తదితర గ్రామాల్లో కుక్కలు దాడులు చేసి పలువురిని గాయపరిచిన సంబంధిత అధికారులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.