రామాయంపేట, జూన్ 7 : తెలంగాణ రాష్ర్టాభివృద్ధ్దికి నిధు లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ధ్వజమెత్తారు. రామాయంపేట మండలం కోనాపూర్ పెద్దతండాలో బుధవారం సేవాలాల్, జగదాంబమాత విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహిస్తు న్నారు. ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యేతోపాటు మహారాష్ట్ర లోని ఔరాఘడ్ పీఠాధిపతి శేఖర్మహరాజ్ తదితరులు సేవాలాల్, జగదాంబ మాతకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి నిధులివ్వకుండా ఆటలాడుతుందన్నారు. నిధులివ్వకుండా సీఎం కేసీఆర్పై నిందలు మోపడం సరికాదన్నారు. రాష్ట్రం ఇప్పటికే అన్నిరంగాల్లో దేశంలోనే అభివృద్ధ్దిలో అగ్రగామిగా ఉందన్నా రు.
తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. పంచాయతీల ఏర్పాటుతో తండాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులను వెచ్చిస్తున్నారన్నారు. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడా నికి ఈ నెల 16 నుంచి ప్రభుత్వం రూ.3లక్షలు ఆర్థికసాయం చేస్తుందన్నారు. కోనాపూర్ తండాకు కమ్యూనిటీ హాల్ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజనులకు గిరిజన బంధు పథకాన్ని త్వరలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, కోనాపూర్ సర్పంచ్ దోమ చంద్రకళ, మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, నాయ కులు ఇమ్మానియేల్, ఉమ్లా నాయక్ల్, రాజు నాయక్, మహేందర్రెడ్డి, మహేశ్, రాజు, రంజిత్ తదితరులు ఉన్నారు.
గిరిజనులకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం : ఎమ్మెల్సీ
సీఎం కేసీఆర్ గిరిజనులకు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. కోనాపూర్ తండాలో సేవాలాల్, జగదాంభికా విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తండాలను పంచాయతీలు చేసింది సీఎం కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ విజయ్కుమార్, బీఆర్ఎస్ నాయకులు పుట్టి అక్షయ్కుమార్, సురేశ్నాయక్ తదితరులు ఉన్నారు.