హత్నూర, ఏప్రిల్ 4: సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయడానికి పరిశ్రమ యాజమాన్యం ఒప్పుకున్నట్లు టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి తెలిపారు.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సంగారెడ్డిలో పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు జరుపగా.. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.41లక్షల చొప్పున నాలుగు కుటుంబాలకు చెల్లించడానికి పరిశ్రమ యాజమాన్యం ఒప్పుకున్నట్లు తెలిపారు. తక్షణ సాయంగా రూ.లక్ష చొప్పున చెల్లించినట్లు తెలిపారు.