సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా తాగు,సాగునీటికి తీవ్రంగా గోసపడ్డదని, కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడిన ఈ ప్రాంతం నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారుతున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తొగుట మండలం తుక్కాపూర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీ నుంచి శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు ఆయన నీటిని వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూడవెల్లి, హల్దీ వాగుల్లో ప్రస్తుతం పారుతున్నవి కాళేశ్వర జలాలు కావా అని ప్రతిపక్షాలను ఆయన ప్రశ్నించారు. చెరువు, కుంటల్లోకి నీరు తరలించడానికి కాలువల నిర్మాణానికి ప్రజా ప్రతినిధులు సహకరించాలని కోరారు.
తొగుట, ఫిబ్రవరి 17: సమైక్య రాష్ట్రంలో తెలంగాణతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లా తాగు, సాగునీటికి తీవ్రంగా గోసపడ్డదని, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడంతో ఇప్పుడు గోదావరి నీళ్లను తెచ్చి పంటలకు పారించుకుంటున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీ నుంచి శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి మల్లన్నసాగర్ ప్రధాన కాల్వకు నీటిని వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలోని కూడవెల్లి, హల్దీ వాగుల్లో ప్రస్తుతం పారుతున్నవి కాళేశ్వర జలాలు కావా అని ప్రతిపక్షాలను ఆయన ప్రశ్నించారు.
ఒకప్పుడు కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడిన దుబ్బాక ప్రాంతం నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతుంటే ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు రాలేవంటున్న ప్రతిపక్ష నాయకులు కూడవెల్లి వాగులో పారుతున్న గోదావరి జలాలను చూసి మాట్లాడాలని హితవు పలికారు. 12వ ప్యాకేజీ ద్వారా దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో 1,25,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. కాల్వ కింద 257 చెరువులు, కుంటలు ఉండగా, 91 చెరువు కుంటలకు మాత్రమే నీళ్లు విడుదల చేస్తున్నామని, మిగతా చెరువు, కుంటల్లోకి కాల్వల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు సహకరించాలని మంత్రి కోరారు.
నాడు కరువు కాటకాలతో కూడవెల్లి వాగు వర్షాకాలంలో సైతం నీరుఉండేది కాదని, నేడు సీఎం కేసీఆర్ చొరవతో జీవనదిని తలపిస్తుందన్నారు. ఇటీవల ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి కూడవెల్లికి, హల్దీవాగులోకి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నుంచి నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. నేడు కూడవెల్లి వాగులో జలాల ప్రవాహంతో ఈ ప్రాం తంలో పండుగ వాతావరణం నెలకొన్నదన్నారు. గతంలో ఒక్క బోరులో దో ఇంచ్ నీళ్లు నడితే పెడ్డ పండుగ చేసుకునే వాళ్లు, యాటను కోసి దావత్ చేసుకునే వాళ్లని, అట్లాంటిది గోదావరి నీళ్లను మలిపిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయమని, తెలంగాణ రాకుంటే కాళేశ్వరం చూసేవాళ్లమా అని మంత్రి అన్నారు.
సీఎం కేసీఆర్ పాలనలో రైతుకు గౌరవం పెరిగిందన్నా రు. రైతులు నీటిని, కరెంట్ను పొదుపుగా వాడుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజున ఆయన చదువుకున్న దుబ్బాక పాఠశాల పక్క నుంచి గోదావరి జలాలను పారించడానికి నీటిని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. దేశ ప్రజలందరి ఆశీర్వాదంతో సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి కేక్ కట్ చేసి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కాల్వలో గోదారమ్మకు పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా శర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ హరిరాం, నీటిపారుదల శాఖ ఎస్ఈ బస్వరాజ్, ఎస్ఈ సాయిబాబా, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, జిల్లా నాయకులు రొట్టె రాజమౌళి, వెంకటనర్సింహరెడ్డి, బక్కి వెంకటయ్య, జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, ఎంపీపీ గజ్జెల సాయిలు, ఆత్మకమిటీ చైర్మన్ నమిలె భాస్కరాచారి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్రెడ్డి, సొసైటీ చైర్మన్, హరికృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ దోమల కొమురయ్య, కంది రాంరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు కనకయ్య, కోఆప్షన్ సభ్యుడు ఎండీ కలీమొద్దీన్, సర్పంచులు సిరినేని గోవర్ధన్రెడ్డి, చంద్రం, మల్లయ్య, బొడ్డు నర్సింహులు, ఎంపీటీసీలు వెల్పుల స్వా మి, కొమ్ము శరత్, నాయకులు చిలువేరి రాంరెడ్డి, కుంభాల శ్రీనివాస్, చిలువేరి మల్లారెడ్డి, కుంభం రఘోత్తంరెడ్డి, శ్రీశై లం, మంగ నర్సింహులు, సుతారి రమేశ్, బక్క కనకయ్య, ఐలయ్య, మల్లే శం, భిక్షపతి, సంతోష్, సురేశ్గౌడ్, శ్రీనివాస్గౌడ్, అరుణ్, అనిల్, వికాస్, రమేశ్, బాలరాజు, స్వామి, రాజు, పరశురాములు పాల్గొన్నారు.
-మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
సీఎం కేసీఆర్కు రైతులంటే ఎంతో ప్రేమని, రైతుల సంక్షేమం కోసం ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం రైతుల కోసం పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గోదావరి జలాలను దుబ్బాక కాలువలోకి విడవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కాలువ ద్వారా దుబ్బాక నియోజకవర్గంతో పాటు సిద్దిపేట, సిరిసిల్ల రైతులకు జలాలు అంది మేలు జరుగుతుందన్నారు. యాసంగి పంటలను కాపాడేందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఆశీస్సులతో నీటిని విడుదల చేసుకోవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు.