సిద్దిపేట, మార్చి 23: పైలేరియా వ్యాధిగ్రస్తులను సీఎం కేసీఆర్ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నదని, అందుకే వారికి ఆసరా పిం ఛన్లు అందజేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. రూ.40 లక్షలతో పైలేరియా వ్యాధిగ్రస్తుల కోసం రాష్ట్రంలో తొలి ప్రక్రియగా సిద్దిపేట నుంచి ఉచిత కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గురువారం సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయం లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ‘సిద్దిపేట క్యాంపు కార్యాలయంలోని నా ఇంటికి మీరు ఎప్పుడైనా రావచ్చు.. మీ ఆనందమే నాకు సంతృప్తిగా ఉంటుంది’.. అం టూ పైలేరియా వ్యాధిగ్రస్తులకు ధైర్యం చెప్పారు. ‘వైద్యం, ఆసరా పింఛన్ల సమస్యల గురించి మీకు సేవ చేయడానికి ప్రత్యేక సిబ్బంది ఉన్నారు, మీకు అన్ని వేళల్లో అందుబాటులో ఉంటారు’.. అం టూ భరోసా ఇచ్చారు.
పైలేరియాతో బాధపడుతున్న వారికి కొంత ఊరట కోసం మందులు, సబ్బులతో కూడిన ప్రత్యేక కిట్లు తయారీ చేసి జిల్లాలో పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 8,121 మం ది పైచిలుకు పైలేరియా బాధితులకు ఉచితంగా కిట్లు అందిస్తున్నామన్నారు. ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు మూడు నెలలకోసారి మందులు అందిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట పట్టణంతోపాటు జిల్లాలోని అన్నిచోట్ల క్లినిక్ ఏర్పాటుచేసి బోదకాల వ్యాధిగ్రస్తులకు వైద్యం అందించేందుకు ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. అందరూ కంటివెలుగును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరామ్, డీఎంహెచ్వో కాశీనాథ్, ప్రజాప్రతినిధులు, వైద్యారోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.