గజ్వేల్, అక్టోబర్ 27: గజ్వేల్ నియోజకవర్గంలోని యువకులంతా సైనికుడిలా పని చేయాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. తూప్రాన్ మండలానికి చెందిన పలువురు యువకులు గజ్వేల్లో శుక్రవారం ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్కు అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. గతంలో కంటే ఈసారి భారీ మెజార్టీ వచ్చేలా గ్రామాల్లో ప్రతి ఇంటికెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలన్నారు.
గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేసి అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా చేశారన్నారు. తూప్రాన్ మండలం నుంచి కేసీఆర్కు అత్యధికంగా ఓట్లు పడేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కోట్లాది రూపాయల నిధులతో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ మండల యువకులు పాల్గొన్నారు.