గుర్తింపు పొందిన కంపెనీల సీడ్స్నే కొనాలి
వ్యవసాయాధికారి గోవిందరాజులు
దౌల్తాబాద్, మే 23 : యాసంగి సీజన్ ప్రాంభమవుతోంది. రైతులు విత్తనాలు వేయడానికి దుక్కులు దున్నుతున్నారు. సీజన్లో వరి, పత్తి, మిర్చి పంటలపైనే రైతాంగం దృష్టి సారిస్తున్నది. వ్యవసాయ శాఖ ద్వారా రాయితీ విత్తనాలు వస్తున్నప్పటికి కొంత మంది రైతులు ప్రైవేటు దుకాణాల్లో విత్తనాలను కొంటున్నారు. తక్కువ ధరతో ఎక్కువ దిగుబడి వస్తుందని దుకాణ నిర్వాహకులు నమ్మించి, విత్తనాలను అంటగడుతున్నారు. దీంతో అనేక చోట్ల నకిలీ విత్తనాల బారిన పడి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయాధికారులు సూచనలు చేస్తున్నారు. ప్రైవేట్ పరంగా విడుదలయ్యేవి ఉంటాయి. ప్రభుత్వపరంగా రూపొందించిన రకాలను ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు నోటిఫైడ్ పేరిట మార్కెట్లోకి వస్తాయి. ప్రైవేట్ సంస్థలు రూపొందించిన విత్తనాలను నోటిఫైడ్ పేరిట మార్కెట్లోకి వస్తాయి. నోటిఫైడ్ విత్తనాల నాణ్యత, పంపిణీ ప్రమాణాలకు అనుగుణంగా లేనట్లయితే ఉత్పత్తిదారులపై, పంపిణీదారులపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు.
పాటించావాల్సిన జాగ్రత్తలు..
వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన దుకాణాల్లోనే రైతులు విత్తనాలను కొనుగోలు చేయాలి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల నుంచి సర్టిఫైడ్ అయిన వాటినే ఎంచుకోవాలి. కొనుగోలు చేసిన విత్తనాలకు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. బిల్లుపై రైతు చిరునామా గడువు తేదీ సంస్థ పేరు లేబుల్, పరిమాణం విత్తనం ధర, అమ్మిన వారి సంతకం వంటి వివరాలు తప్పనిసరిగా ఉండాలి. విత్తన బస్తాపై ముద్రించిన ధ్రువపత్రం బిల్లు తమ పంట చేతికి వచ్చే వరకు రైతులు భద్రపరుచుకోవాలి. సంచులపై విత్తన ఉత్పత్తి విక్రయదారుడి పేరు చిరునామా లాట్ నెంబర్ ఉండాలి. విత్తనాలను కొన్న వెంటనే మొలక శాతం పరీక్షించుకోవాలి. కనీసం 75శాతం ఉంటేనే విత్తు విత్తుకోవాలి. విత్తన సంచులను రైతులు నమూనా వివరాల కోసం పంట కోతకు వచ్చేవరకు దాచుకోవాలి.
అధికారుల సూచనలు పాటించండి..
రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు మీ దగ్గరలోని వ్యవసాయ అధికారిని అడిగి వారు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు అవి మేలు రకమైన విత్తనాలా? కాదా? అని చూసి తీసుకోవాలి. నాసిరకం విత్తనాలను వ్యాపారులు ఇవ్వాలని చూస్తే, వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి.
– గోవిందరాజులు, మండలం వ్యవసాయాధికారి, దౌల్తాబాద్