మొగులుకు మొఖం పెట్టే రోజులు పోయాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. వర్గల్ మండలం సింగాయిపల్లి వద్ద మంగళవారం రామాయంపేట కెనాల్కు గోదావరి జలాలను మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డితో కలిసి ఆయన వదిలారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ లాంటి ప్రాజెక్టులు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. వర్గల్, గజ్వేల్, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నిజాంపేట మండలాల మీదుగా మెదక్ జిల్లాలో ఆరు మండలాల రైతులకు ఈ కాల్వ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడుతున్నదని తెలిపారు. ఎండుతున్న పంటలకు జీవం పోసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని కొనియాడారు. ప్రాజెక్టుల నిర్మాణమే లేకుంటే తెలంగాణ ఎడారిగా మారేదని గుర్తుచేశారు.
– వర్గల్, ఆగస్టు 29
వర్గల్, ఆగస్టు 29: “వానకాలంలో వర్షాలు పడకపోతే వేసిన పంటలు చేతికొస్తాయో లేదో అనే అనుమానం గతంలో రైతులకు ఉండే. ఎండుతున్న పంటలను చూసిన రైతులు వానల కోసం మొగులుకు మొఖం పెట్టి చూస్తుండేవారు. ఇప్పుడు ఆ రోజులు పోయినయ్. ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని ప్రాజెక్టులు, కాలువలు నిర్మించుకున్నాం. వర్షాలతో పనిలేకుండా ప్రాజెక్టుల నీళ్లు కాల్వల నుంచి ఎప్పుడు వస్తాయి” అని రైతులు ఎదురుచూస్తున్నారని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం వర్గల్ మండలం సింగాయిపల్లి వద్ద రామాయంపేట కెనాల్ నుంచి కొండపోచమ్మసాగర్ నుంచి వచ్చే కాలువ నుంచి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపరెడ్డిలతో కలిసి గోదావరి నీళ్లను వదిలారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ లాంటి చరిత్రాత్మక ప్రాజెక్టులను నిర్మించి దేశానికే తెలంగాణను అన్నంపెట్టే అన్నపూర్ణగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. వరి పండించడంలో దేశంలోనే పంజాబ్ను దాటి ప్రథమస్థానంలో ఉన్నామన్నారు. తెలంగాణ ధాన్యాగారంగా మారడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ప్రాజెక్టుల నిర్మాణమే లేకుంటే తెలంగాణ ఎడారిగా ఉండేదని తెలిపారు. వర్గల్, గజ్వేల్, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నిజాంపేట మండలాల మీదుగా మెదక్ జిల్లాలో ఆరు మండలాల రైతులకు ఈ కాలువ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
సరైన సమయంలో వానలు పడక ఇబ్బందులు పడుతున్న రైతులకు రామాయంపేట కెనాల్ నుంచి నీళ్లు వదలడం నిజాంపేట రైతులు చేసుకున్న అదృష్టమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. 15 రోజలుగా వర్షాలు పడకపోవడంతో నిజాంపేట రైతులు పత్తి, మొక్కజొన్న చేన్లను చూసి దిగాలు చెందుతున్నారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఇరిగేషన్ శాఖ అధికారులను అప్రమత్తం చేసి మంగళవారం కాలువలోకి నీళ్లు వదిలారన్నారు. ఎండుతున్న పంటలకు జీవం పోసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. మెదక్ నియోజకవర్గంలోని నిజాంపేట మండల కాలువ ఆయకట్టు ప్రాంతాల రైతులకు ఈరోజు శుభ దినమన్నారు. కార్యక్రమంలో వర్గల్ జడ్పీటీసీ బాలమల్లు, ఎంపీపీ లతారమేశ్ గౌడ్, బీసీసెల్ అధ్యక్షుడు అంబార్పేట మురళీగౌడ్, సింగాయిపల్లి సర్పంచ్ సంగీతావేణుగోపాలరావు, తొగుట బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, ఇరిగేషన్ శా ఖ అధికారులు, వర్గల్ మండల బీఆర్ఎస్ పా ర్టీ ఉపాధ్యక్షుడు తుమ్మ గణేశ్, నాయకులు,