చిలిపిచెడ్, డిసెంబర్ 14 : రైతులు పంటలను సాగు చేసే ముందు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలని నత్నాయపల్లి ఏరువాక శాస్త్రవేత డాక్టర్ శోభ సూచించారు. బుధవారం మండల పరిధిలోని చండూర్ గ్రామ శివారులోని రైతు నారాయణరెడ్డి సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్న నిమ్మ, జామ తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు వివి ధ రకాల నేలలు- వాటి స్వభావాలపై అవగాహన కల్పించా రు. డాక్టర్ శోభ మాట్లాడుతూ.. భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయన్నారు.
వరి కొయ్యలను తగలబెట్టొద్దని.. తగలబెడితే భూమి భూసారం కొలుపోతుందన్నారు. సాగులో ఆధునిక పద్ధతులు పా టించాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో బాల్రెడ్డి, ఏఈవో లు భూపాల్, కృష్ణవేణి, వైస్ ఎంపీపీ విశ్వంభర స్వామి, రైతుబంధు జిల్లా సభ్యుడు సయ్యాద్ హుస్సేన్, మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, కో అప్షన్ సభ్యుడు షఫీ, సర్పంచ్ గోపాల్రెడ్డి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, వీరాస్వామి, శంకర్రెడ్డి, మాణిక్యరెడ్డి, వెంకటేశం, విఠల్, మాల్లారెడ్డి, మాణిక్యం, నర్సింహులు, పాండరి పాల్గొన్నారు.