సిద్దిపేట, ఏప్రిల్ 15: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేయాలని కోరుతూ సిద్దిపేట నియోజకవర్గ రైతులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. సీఎం రేవంత్రెడ్డికి పోస్ట్కార్డుల ద్వారా హామీలు అమలు చేయాలని ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు నిరసన తెలిపారు. పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్న రైతులకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, రైతుసంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు. సిద్దిపేట పత్తి మారెట్ యార్డులో రైతులు సీఎం రేవంత్రెడ్డికి పోస్ట్ ద్వారా ఉత్తరాలు రాశారు. నియోజకవర్గంలోని చిన్నకోడూర్, సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్, నంగునూరు మండలం నుంచి రైతులు స్వచ్ఛందంగా ఉత్తరాలు రాశారు. ఇచ్చిన హామీలు 100 రోజులైనా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకుంటే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.